Friday, February 27, 2015

ప్రయాణీకుల ప్రయోజనాలకు పెద్ద పీట.

రైల్వే బడ్జెట్లో తీరని తెలంగాణ, ఏపీలకు తీరని అన్యాయం జరిగింది.. కొత్తగా రైళ్లు, లైన్లు ప్రాజెక్టులు లేవు.. విశాఖ రైల్వే జోన్ ఊసేది?.. వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీలు ఏమయ్యాయి..
బడ్జెట్ ప్రసంగం వినగానే రాజకీయులు, జర్నలిస్టుల, మేధావుల స్పందన ఇది.. ప్రతి ఏటా జరిగే తంతుకు భిన్నంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమర్పించిన బడ్జెట్ ఉండటం చూసి అవాక్కయ్యారు.. అసలు ఇది రైల్వే బడ్జెట్లేనా అంటూ పెదవి విరిచిన వారు కొందరు..
ప్రతి ఏటా బడ్జెట్లో అవీ ఇవీ అని వాగ్దానాలు ఇవ్వడం.. అమలు చేయకుండా పెండింగ్ పెట్టడం, మళ్లీ వచ్చే బడ్జెట్లోనూ ఇదే పని చేయడం ప్రభుత్వాలకు అలవాటైపోయింది.. వాటికి అలవాటు పడిపోవడం మనవంతైపోయింది.. అందుకే భిన్నంగా ఉన్నదాన్ని స్వాగతించలేని స్థితికి చేరుకున్నాం..
సురేష్ ప్రభు ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్ పూర్తి వాస్తవిక దృక్పథంతో ఉంది. ఛార్జీలను పెంచకుండానే సౌకర్యాలను మెరుగు పరచడానికి ప్రాధాన్యత ఇచ్చారు.. ఏం చేయబోతున్నదీ స్పష్టంగా చెప్పారు. ముందు ఉన్నవాటికి చక్కదిద్దుకున్నాకే కొత్త వాటి జోలికి వెళదామంటున్నారు. ప్రయాణీకుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసిన స్పచ్ఛ రైల్వే బడ్జెట్ ఇది..

No comments:

Post a Comment