Saturday, February 21, 2015

రూ.8 వేల సూటు రూ. 4.31 కోట్లు పలికింది.

నిజం నిద్ర లేచే లోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు.. ప్రధాని నరేంద్ర మోదీ సూట్ విషయంలో జరిగింది అదే.. కానీ ఒకందుకు మంచే జరిగింది.. కేవలం రూ.8,000 ఖరీదు చేసే సూటు రూ. 4,31,00,000 లకు వేలంలో అమ్ముడు పోయింది..
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన ఈ సూటు అందరికీ ఆకట్టుకుంది.. కారణం ఆ సూటుపై ఉన్న నిలువు గీతల్ని పరిశీలిస్తే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని ఇంగ్లీషులో రాసి ఉండటమే..దీన్ని అడ్డు పెట్టుకొని మోదీకి కీర్తి కండూది ఎక్కువని ప్రత్యర్ధులు విమర్శలకు దిగారు.. అదే సమయంలో ఓ ఆంగ్ల పత్రిక రాసిన  కథనం దుమారానికి తెర తీసింది.. మోదీ ధరించిన సూట్ రూ. 50 వేల నుండి 5 లక్షల దాకా ఖరీదు చేస్తుందని ఓ ఫ్యాషన్ డిజైనర్ చెప్పినట్లు రాసింది.. తాను అలా చెప్పలేదని ఆ డిజైనర్ వివరణ ఇచ్చుకునేసరికి ఖంగుతున్ని ఆ పత్రిక తాము పొరపాటున ఈ డిజైనర్ పేరును ప్రస్థావించామని, తమకు చెప్పింది వేరే డిజైనర్ అంటూ పత్రిక మాట మార్చేసింది. కానీ ఆ డిజైనర్ ఎవరో చెప్పలేదు. అంటే ఆ పత్రిక కథనం ఎంత అబద్దమో అర్థమైపోయింది..
సదరు పత్రిక దుష్ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ మోదీ సూట్ విలువను రూ.10 లక్షలుగా ఢిల్లీ  ఎన్నికల సభలో చెప్పుకొచ్చారు.. కొందరైతే ఏకంగా కోటి రూపాయలకు పెంచేశారు.. మోదీతో పాటు ఆయన టైలర్ కూడా ఈ వార్తను ఖండించినా సదరు పత్రిక దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. వాస్తవానికి ఈ సూట్ అసలు ఖరీదు కేవలం ఎనిమిది వేలేనట..
మోదీ సూట్ విషయంలో అబద్దపు కథనాన్ని వండిన ఆ పత్రికకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.. ఈ కోటుకు లభించిన ప్రచారం పుణ్యమా అని కేవలం 8 వేల రూపాయల విలువజేసే ఈ సూట్  ఏకంగా నాలుగు కోట్ల 31 లక్షలకు వేలంలో అమ్ముడుపోయింది. గుజరాత్ వజ్రాల వ్యాపారి లాల్జీ పటేల్ మోదీ సూట్ కొనుగోలు చేశారు.ఈ నిధులను గంగా నది ప్రక్షాళనకు ఉపయోగిస్తున్నారు..

No comments:

Post a Comment