Wednesday, February 18, 2015

పరధ్యాన్నం పరమేశ్వర రావులు..

దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేయమన్నాడట ఓ ఆసామి.. ఇలాంటి పరధ్యానం పరమేశ్వర్రావులు అంతటా ఉంటారు.. 
మన ఆనంద్ గాడు దావత్ ఇస్తాను అందరినీ తప్పకుండా రమ్మన్నాడు అని చెప్పాడో చిన్నప్పటి దోస్తు.. పిల్లికి బిచ్చంవేయని ఆనంద్ గాడు దావత్ ఇవ్వడం ఏమిటి అని సందేహిస్తూనే ఎప్పుడూ? అని అడిగాను.. వాడు చెప్పిన సమాధానం విని నవ్వాగలేదు.. ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు.. ఒక్కసారి క్యాలెండర్ చూసుకోమన్నాను.. మొబైల్ క్యాలెండర్ తిరిచి వాడు అవాక్కయ్యాడు.. ఇంతకీ ఆనంద్ దావత్ ఇస్తానన్న తేదీ ఏమిటో తెలుసా?.. ఫిబ్రవరి 30.
రెండు మూడేళ్ల క్రితం ఓ ఛానెల్ కార్యాలయంలో జరిగిన యదార్ధ ఘటన మరొకటి.. ఓ రిపోర్టర్ హడావుడిగా పరుగెత్తుకొచ్చి కో ఆర్డినేటర్ కు చెప్పాడు.. హుస్సేన్ సాగర్ తగలబడిపోతోంది అని.. పాపం కో ఆర్డినేటర్ గారు ఓబీ వ్యాన్ పంపండి అంటూ హడావుడి పడిపోయాడు.. ఆ రోజు ఏప్రిల్ 1..
కొన్నిసార్లు నేనూ పరధ్యాన్నం పరమేశ్వర రావునే.. బంకులో పెట్రోలు కొట్టించుకొని చిల్లర తీసుకోకుండానే బండ్ స్టార్ట్ చేసుకొని వెళ్లిన సందర్భాలు ఎన్నో..

No comments:

Post a Comment