Thursday, February 19, 2015

ఇంతకీ కవిత గారు ఏం మాట్లాడబోతున్నారు?..

జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత గారిని ముఖ్యఅతిధిగా పిలిచారనే ఆహ్వాన పత్రికను చూసి అందరూ ఆశ్చర్యంగా వేసిన ప్రశ్న ఇది.. జమ్మూ కాశ్మీర్ విషయంలో కవిత చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలసిందే.. కొద్ది రోజుల తర్వాత ఆమె కాశ్మీర్ పండితుల సమస్యపై పార్లమెంట్లో ప్రస్థావించి అందరినీ ఆశ్యర్య పరిచారు.. 
ఆ నేపథ్యంలో తాజాగా ఎంపీ కవిత గారు ఏం మాట్లాడతారు అనేది అందరికీ ఆసక్తి ఉండటం సహజమే.. తినబోతూ గారెల రుచి అడగటం ఎందుకు రండి ఈ కార్యక్రమానికి..
జమ్మూ కాశ్మీర్ సంకల్ప్ దివస్ కార్యక్రమానికి రండి.. అసలు కాశ్మీర్లో ఏం జరుగుతోందో తెలుసుకోండి.. తేదీ: 20.02.2015, సమయం: 6pm, వేదిక బద్రుకా కాలేజీ, కాచిగూడ, హైదరాబాద్..:

No comments:

Post a Comment