Sunday, February 22, 2015

జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో సంపూర్ణ అంతర్భాగమని పార్లమెంట్ తీర్మానించిన రోజు..

జమ్మూ కాశ్మీర్ విషయంలో ఫిబ్రవరి 22, 1994 నాడు భారత పార్లమెంట్ లో చేసిన ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ రోజును జమ్మూ కాశ్మీర్ సంకల్ప్ దివస్ పేరిట జరుపుకుంటున్నాం.. ఈ తీర్మానంలోని ముఖ్యాంశాలు..
1.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పూర్తిగా భారత దేశంలోని అంతర్భాగం. దేశం నుండి జమ్మూ కాశ్మీర్ ను విడగొట్టే ప్రయత్నాలను ఎదుర్కొంటాం.
2.దేశ ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా సాగించే ఏ చర్యలనైనా తిప్పిట్టే సామర్థ్యం భారత దేశానికి ఉంది.
3.భారత దేశంలో భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రాంతాల నుండి పాకిస్తాన్ తక్షణం వైదొలగాలి.
4.భారత దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం..
ఈ చారిత్రిక తీర్మానం వెనుక ఉన్న నేపథ్యం అందరికీ తెలిసిందే..జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారత దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వెర్రి తలలు వేస్తున్న వేర్పాటువాదం వెనుక పాకిస్తాన్ పాత్ర ఉందనే విషయం అందరికీ తెలిసిందే వేర్పాటు వాదులకు ఆయుధాలు, ధన సాయం చేస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ కోసం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో పెద్ద ఎత్తున శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో విదేశీ శక్తుల మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. మతోన్మాదం, భారతీయ వ్యతిరేక కలగలసిపోయాయి.
 సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న కాశ్మీరి పండిట్లు, దేశ భక్తులు ఉగ్రవాదులకు టార్గెట్ అయ్యారు.. అడ్డూ అదుపూ లేకుండా కాశ్మీర్లో హత్యలు, లూఠీలు, గృహ దహనాలు, అత్యాచారాలకు దిగారు. ఆలయాలకు ధ్వసం చేశారు. తమకు మద్దతు ఇవ్వకపోతే కాశ్మీర్లో ఉండటానికి వీలు లేదని హుకుం జారీ చేశారు.. ఆస్తులను బలవంతంగా లాక్కొని తరిమేశారు.. ఫలితంగా లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు కన్నీటితో తమ స్వస్థలమైన కాశ్మీరీ లోయను వదిలి జమ్మూ, ఢిల్లీలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. స్వదేశంలోనే శరణార్ధులుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడింది.

సిమ్లా ఒప్పందానికి తూట్లు పొడచిన పాకిస్తాన్ పదే పదే భారత దేశ అంతర్గత వ్యహారాల్లో జోక్యం చేసుకుంటోంది. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితితో సహా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రస్థావిస్తూ అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తోంది.. జమ్మూ కాశ్మీర్ లో దాదాపు సగ భాగాన్ని తన కబ్జాలో పెట్టుకున్న పాకిస్తాన్, అందులో నుండి చైనాకు ఉదారంగా అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని దారాదత్తం చేసింది.. ఈ నేపథ్యంలో భారత దేశం పార్లమెంట్లో 1994 ఫిబ్రవరి 22నాడు పై చారిత్రిక తీర్మానాన్ని చేసింది.. ఈ తేదీన జమ్మూ కాశ్మీర్ సంకల్ప్ దివస్ ను దేశ, విదేశాల్లో జరుపుకుంటున్నారు.. 

No comments:

Post a Comment