Tuesday, February 10, 2015

మీ జీతాలకేనా న్యాయం చేయడండి బాబులూ..

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఉద్యోగుల పని గారెల బుట్టలో పడ్డట్లయింది.. ఇకపై తమ పీఆర్సీలు, జీతాలు, గీతాలు అంటూ పెద్దగా రోడ్లెక్కాల్సిన అవసరం లేదు.. ఉద్యోగులకు ఎవరు ముందు మేళ్లు చేద్దామా అని ఇరు సర్కార్లు పోటీ పడుతుంటాయి. ఒక సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరో సర్కారుకు అదే నిర్ణయం తీసుకోక తప్పదు.. (అవతలి వాడి రెండు కళ్లు పోవాలని తన ఒక కన్ను పోవాలని కోరుకున్నాడనే పురాణ గాథ ఇక్క అప్రస్తుతం అనుకోండి..)

రెండు తెలుగు ప్రభుత్వాలు ఉద్యోగుల ఫిట్ మెంట్ 43 శాతానికి పెంచాయి.. మంచిదే(?)..మరి వారి నుండి మరింత బాధ్యతాయుతమైన పనిని రాబట్టుకునే ఆలోచన ఈ సర్కార్లకు ఏమైనా ఉందా? ఇది చదివేవాళ్లలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అయివుండి నొచ్చుకుంటే నేనేమి చేయలేను.. నిజం మాట్లాడితే కాస్త నిష్టూరం సహజమే కదా.. నేను గమనించిన ప్రభుత్వ ఉద్యోగుల గురుంచే రాస్తున్నాను.. ముప్పాతిక శాతం (ఇంకా తక్కువే ఉండొచ్చు)
ఉద్యోగులు ఏనాడు సమయానికి ఆఫీసుకు చేరుకోరు.. దాదాపు గంట సేపు ముచ్చట్ల తర్వాతే పని ప్రారంభిస్తారు.. అదీ చాలా లేజీగా, పనిలో నత్తతో పోటీ పడతారనడం నిజం.. మధ్యలో ఛాయ్ పానీ టైమ్ పాస్.. ఈలోగా లంచ్ టైమ్ వచ్చేస్తుంది.. అలా మరో గంట గడుస్తుంది.. తర్వాత కునికి పాట్లు, పనితో కుస్తీ..మధ్యలో మరో టీ బ్రేక్..ఆతర్వాత ఏదో అలా పని చేశామనిపిస్తూ ఆపీస్ అయిపోయే సమయం కోసం ఎదురు చూపులు.. ఆ తర్వాత ఇంటి బాట..రాష్ట్ర సచివాలయంలో ఎప్పుడు చూసినా క్యాంటీన్ పరిసరాల్లో తచ్చాడే ఉద్యోగులను చాలా సార్లు చూసినట్లు గుర్తుంది.. నేనేమి పని గట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులను విమర్శించడం లేదు. వారి తత్వాన్ని వివరిస్తున్నానంతే.. సిన్సియర్ ఉద్యోగులను కూడా నేను చూశాను.. వారికి ఎంత కితాబిచ్చినా తక్కువే.. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుల గురుంచి ఎంత చెప్పినా తక్కువే..
మనం తీసుకుంటున్నది ప్రజల సొమ్ము.. వారిలో ప్రయివేటు రంగ ఉద్యోగులు, అల్పాదాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారు.. ప్రభుత్వ ఉద్యోగులకంటే వారే ఎక్కువ కష్టపడతారు.. పని వేళలు కూడా ఎక్కువే.. సోకాల్గ్ కార్మిక చట్టాలు ఉన్నా వారి పనికి తగ్గ వేతనాలు అసలు ఉండవని తెలిసిందే.. ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగాలు జీతాల పోలిక ఇబ్బంది కలిగించి ఉండొచ్చు.. కానీ ముందే చెప్పాను నిజం నిష్టూరం లాంటిది కదా..

బాబూలూ (ఉత్తరాదిన సర్కారీ ఉద్యోగులను ఇలాగే పిలుస్తారు).. కనీసం మీ జీతాలకు అయినా న్యాయం చేసేలా పని తీరును మెరుగు పరచుకొండి.. మనం పని చేస్తున్నది ప్రజల కోసం అని గుర్తుంచుకొండి.. కాస్త సేవాభావం పెంచుకోండి.. ఫలితాలు చూపించండి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి.. ఉత్తమ పాలన అందించండి.. జీతాలతో పాటు పని తీరులోనూ రెండు సర్కార్లు పోటీ పడాలని కోరుకుంటున్నాను..

No comments:

Post a Comment