Saturday, February 21, 2015

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కవిత మద్దతు

జమ్మూ కాశ్మీర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం.. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఉంది. కాశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది.. జమ్మూ కాశ్మీర్ సంపూర్ణంగా భారత దేశంలో అంతర్భాగం అని 1994లో చేసిన తీర్మానానికి అనుగుణంగా మనమంతా ఆ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, కాశ్మీరీ పండిట్ల సమస్య పరిష్కరించేందుకు అధికారంలో ఉన్న బీజేపీ పని చేయాల్సిన అవసరం ఉంది.. జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం హైదరాబాద్ లో నిర్వహించిన  జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రసంగంలో అంశాలివి.. అమె ఇంకా ఏమన్నారో చూడండి..
జమ్మూ కాశ్మీర్ లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఆర్టికల్ 370, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విషయంలో యూటర్న్ తీసుకుందా?.. స్వయం ప్రతిపత్తి గురుంచి మాట్లాడే పీడీపీతో రాజీ పడుతోందా?.. కాశ్మీర్ గురుంచి తాను ఏమి మట్లాడినా ప్రశంసలతో పాటు రాళ్లు, కేసులు పడుతున్నాయని చమత్కరించారు కవిత..
ఈ కార్యక్రమానికి జేకేఎస్సీ హైదరాబాద్ ఛాప్టర్ అధ్యక్షులు, ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ అధ్యక్షత వహించారు. ముఖ్యవక్తగా హాజరైన సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్ రావు జమ్మూ కాశ్మీర్తో భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని, ఆ రాష్ట్రానిని కాపాడుకోవడానికి మన సైనికులు చేసిన త్యాగాలను వివరించారు. 1994లో పార్లమెంట్లో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని, నాటి ప్రతిపక్ష నేత అటల్ బీహారీ వాజపేయి ఐక్యరాజ్య సమితితో పాకిస్తాన్ ను కట్టడి చేసిన తీరును గుర్తు చేశారు.. కార్యక్రమంలో కాశ్మీరీ పండిట్ల కుటుంబాలు ఎంపీ కవితను తస్కరించాయి. చాలా స్వల్ప సమయంలో నిర్వహించానా సంకల్ప్ దివస్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. బద్రుకా కాలేజీ ఆడిటోరియం అంతా కిక్కిరిసిపోయింది..

No comments:

Post a Comment