Thursday, December 25, 2014

మదన్ మోహన్ మాలవీయ – MMM..

 ఆయన చేపట్టిన మహా యజ్ఞానికి నిజాం నవాబు కూడా విరాళం ఇవ్వక తప్పలేదు.. That is MMM మనీ మేకింగ్ మిషన్..
మదన్ మోహన్ మాలవీయ పేద కుటుంబంలో పుట్టి అతికష్టం మీద చదువుకోగలిగారు.. వేదాధ్యనం చేశారు.. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి న్యాయవాద విద్య పూర్తి చేసుకొని లాయర్ అయ్యారు.. జాతీయ ఉద్యమంలో చేరి స్వాతంత్ర్య సంగ్రామంలో తనవంతు పాత్ర పోషించారు.. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా, గాంధీజీకి సన్నిహితునిగా పని చేశారు..
చిన్నప్పుడు చదువుకోడానికి తాను పడ్డ కష్టం మరెవరికీ రాకూడనుకున్నారు మదన్ మోహన్ మాలవీయ.. అందు కోసం ఏకంగా విశ్వ విద్యాలయం స్థాపించడానికి నిర్ణయించుకున్నారు.. దానికి బెనారస్ హిందూ యూనివర్సిటీ అనే పేరు పెట్టారు.. ఇందు కోసం అవసరమయ్యే నిధుల కోసం కాలికి బలపం కట్టుకొని దేశమంతా తిరిగారు.. మాలవీయ వ్యక్తిత్వం తెలిసిన సంస్థానాధీశులు, ప్రముఖులు, నాయకులు, ధనవంతులు భూరి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు.. మాలవీయ ఎక్కడికి వెళ్లినా ఉత్త చేతులతో తిరిగి రారని పేరుండేది.. అందుకే ఆయనను మనీ మేకింగ్ మిషన్ అని సరదాగా పిలిచేవారు..
ఈ క్రమంలో మదన్ మోహన్ మాలవీయ హైదరాబాద్ వచ్చారు.. సంస్థానాధీశుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను కలసి తాను ఎందుకు వచ్చానో వివరించాడు.. ముస్లింనైన నేను హిందూ యూనివర్సిటీకి విరాళం ఇవ్వడం ఏమిటి.. ప్రసక్తే లేదు అని నిరాకరించాడు నవాబు.. కానీ మాలవీయ ఉత్తి చేతులతో పోయే కాదు కదా.. నిజాం ప్యాలస్ నుండి బయటకు వచ్చారు.. నగర వీధుల్లో తిరుగుతుండగా ఓ శవయాత్ర కనిపించింది.. ఊరేగింపులో శవంపై చిల్లర నాణేలు చల్లుతున్నారు.. పరుగున వెళ్లి ఏరుకోవడం మొదలు పెట్టారు.. దారిన పోయేవారు మాలవీయ చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయారు.. సమాచారం నిజాం నవాబుకు చేరింది.. మదన్ మోహన్ మాలవీయను పిలిచి ఏమిటి మీరు చేస్తున్న పని అని నిలదీశాడు.. తాను చేపట్టిన సంకల్పం నెరవేర్చుకునేందుకు ఉత్తి చేతులతో హైదరాబాద్ వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారాయన.. తన తప్పును గుర్తించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ సముచిత రీతిలో విరాళం అందించారు.. విజయగర్వంతో హైదరాబాద్ నుండి బయలు దేరారు మాలవీయ..

ఈ కథ రకరకాలుగా ప్రచారంలో ఉంది.. కానీ ఏది ఏమైనా మదన్ మోహన్ మాలవీయ సంకల్పానికి అద్దం పట్టే కథ ఇది.. That’s MMM.. మనీ మేకింగ్ మిషన్.. ఆయన చేసిన కృషి ఫలించింది బెనారాస్ యూనివర్సిటీ మనోన్నత విద్యాలయంగా ఆవిర్భవించింది..

No comments:

Post a Comment