Wednesday, December 17, 2014

పెషావర్లో దారుణం..

మాటలకందని రాక్షసకాండ ఇది.. విష సర్పాన్ని పెంచి ముద్దాడితే ఏమవుతుంది?.. ఊహించిందే జరిగింది.. భారత దేశంపై విషయం కక్కుతూ ఆవిర్భవించిన పాకిస్తాన్ చివరకు తాను తీసిన గోతిలో తానే పడుతోంది..
పెషావర్ నగరంలో సైనిక పాఠశాలపై తాలిబాన్లు దాడి చేసి 130కి పైగా విద్యార్థులను పొట్టన పెట్టుకోవడం ప్రపంచాన్నే నివ్వెరపరచింది.. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై ఉన్న కోపాన్ని పసి పిల్లలపై చూపించారు తాలిబాన్లు.. ఈ తాలిబాన్లు ఎక్కడివారో, ఎవరు పెంచి పోషించారో అందరికీ తెలుసు.. పాకిస్తాన్ తాను చేసిన పాపానికి తానే బలవుతోంది.. ఇప్పటికైనా ఆ దేశ పాలకులకు కనువిప్పు కావాలి..

No comments:

Post a Comment