Wednesday, December 24, 2014

మరోసారి మోదీ శక్తి..

కాంగ్రెస్ ముక్త్ భారత్.. బీజేపీ ఇచ్చిన నినాదం వాస్తవ రూపంలో కొనసాగుతోంది.. దేశమంతటా వరుసగా కాంగ్రెస్ కోటలు కూలుతున్నాయి.. తాజా ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పడిపోవడమేకాదు.. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలన్నా చిన్నదైపోయింది..
ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఓ మిత్రుడు ఇక బీజేపీ పని అయిపోయిందని సంబరపడ్డాడు.. ఆయన ఉద్దేశ్యం ఝార్ఖండ్లో బీజేపీకి ఎగ్జిట్ ఫోల్స్ చెప్పినట్లు సీట్లు రాలేదని. జమ్మూకశ్మీర్లో మిషన్44+ సక్సెస్ కాలేదని.. ఝర్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ బీజేపీకి ఉంది.. తొలిసారి హంగేతర ప్రభుత్వం అక్కడ ఏర్పటవుతోంది..
ఇక జమ్మూ కశ్మీర్ విషయానికి వస్తే అక్కడ బీజేపీ సాధించిన విజయం చిన్నదేం కాదు.. పీడీపీ 28 స్థానాలు పొందితే, బీజేపీ 25 సీట్లు సాధించింది.. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఓట్ల శాతంలో బీజేపీదే పైచేయి.. బీజేపీకి 23 శాతం వస్తే, పీడీపీకి 22.7 శాతం ఓట్లు దక్కాయి.. కశ్మీర్ లోయ, లద్దాక్ లలో బీజేపీకి సీట్లు రాకపోవచ్చు కానీ రాష్ట్రంలో కీలక శక్తిగా బీజేపీ ఆవిర్భవించడం వేర్పాటు వాదులకు గడ్డు పరిస్థిస్తే.. వాస్తవానికి ఫలితాలను ఇంతకు మించి ఊహించడం కాస్త అత్యాశే అవుతుంది.. జమ్మూ, కశ్మీర్ లోయ జనాభా నిశ్పత్తి ప్రకారం చూస్తే కశ్మీర్లో అసెంబ్లీ సీట్లు కాస్త ఎక్కువున్నాయి.. కాబట్టి సహజంగా అక్కడ విజయం సాధించే వారిదే పైచేయి అవుతుంది..

జమ్మూ కశ్మీర్లో బీజేపీ మిషన్ 44+ ఒక సంకల్పం.. అది పూర్తిగా సాధ్యం కాకున్నా, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఓటింగ్ జరగడం, పోలింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్య విజయం.. అక్కడ ఎవరు ఓడినా, గెలిచినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, గ్రాంట్లతోనే ప్రభుత్వం నడవాల్సిందే.. అక్కడి ప్రజలు క్రమంగా వేర్పాటు వాదులను దూరం పెడుతూ క్రమంగా యావద్దేశంతో మమేకం అవుతున్నారు.. కశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు భారత ప్రభుత్వ అవసరం వారికి తెలిసివచ్చింది..

No comments:

Post a Comment