Wednesday, December 24, 2014

విలువ పెరిగిన భారత రత్న..

భారత రత్న అవార్డుకు ఈసారి నిజంగా విలువ పెరిగింది.. రెండు మహోన్నత శిఖరాలకు ఈ రత్నాలను అలంకరిస్తున్నారు.. ఒక మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడికి, మరో మహా రాజనీతిజ్ఞునికి భారత రత్న అవార్డులను ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయించడం ఎంతో ఆనందించదగిన విషయం..
భారత స్వాతంత్ర్య సమయపోరాటంలో కీలక పాత్ర పోషించిన పండిత మదన్ మోహన్ మాలవీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా పని చేశారు.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించారు. విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు.. సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన మావవీయ చిన్నప్పుడే వేదాంతం అభ్యసించారు.. సమాజంలో కుల, మత బేధాలకు వ్యతిరేకంగా పని చేశారు.. మహాత్మా గాంధీతో కలిసి లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లడంతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రెండు దిన పత్రికలను కూడా స్థాపించారు. సరిగ్గా స్వాతంత్ర్యానికి ఒక సంవత్సరం ముందే కన్ను మూశారు..
అటల్ బిహారీ వాజపేయి మహోన్నత జాతీయ వాది.. దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన మహానీయుడు.. ఆర్ఎస్ఎస్ ద్వారా సమాజ సేవను ప్రారంభించిన అటల్జీ, జనసంఘ్, బీజేపీలకు నాయకత్వం వహించారు.. ఎమర్జెన్సీ కాలంలో జైలుపాలయ్యారు.. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు.. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల పాలన ప్రారంభం అయ్యాక తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నాయకత్వం వహించి పరి పాలనలో తన సత్తా చాటారు.. సమర్థ నాయకత్వంతో సుస్థిర ప్రభుత్వాన్ని ఆచరణలో చూపించడమే కాకుండా, సంస్కరణ వేగం పెంచి దేశాన్ని ఆర్ధికంగా బలోపేతం చేశారు.. స్వర్ణ చతుర్జుజి లాంటి పథకాలతో మౌళిక సదుపాయాలను మెరుగు పరిచారు. పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరి మన్నలు అందుకుంటున్నారు వాజపేయి.. అటల్జీ మంచి నాయకుడు మాత్రమే కాదు వక్త, కవి, రచయితగా కూడా ప్రసిద్దులు.. ఆయన జన్మదినాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుపరిపానా దినోత్సవంగా ప్రకటిచడం దేశ ప్రజలందరికీ గర్వకారణం..

మదన్ మోహన్ మాలవీయజీ, అటల్ బిహారీ వాజపేయిజీ.. ఇద్దరి జన్మదినోత్సవాలు డిసెంబర్ 25వ తేదీనే.. ఇరువురినీ భారత రత్న అవార్డులు వరించడం అదృష్టం..


No comments:

Post a Comment