Saturday, December 13, 2014

పాశ్చాత్య మీడియా వక్ర దృష్టి..

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే సామెత మనకు బాగా తెలిసిందే. దేవుడు మన పట్ల సానుభూతితో ఉన్న మధ్యలో ఉండే పూజారే మనపై శీతకన్నేశాడనే అర్థంలో దీన్ని వాడుతుంటారు. ఈ సామెత విషయాన్ని పక్కన పెడితే.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత TIME (టైమ్) పత్రిక ప్రతి ఏటా ఎంపిక చేసే పర్సన్ ఆఫ్ ఇయర్ కోసం పాఠకుల అభిప్రాయాలను సేకరిస్తుంటుంది. ఈసారి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యధిక పాఠకులు మద్దతు పలికారు. 16.2 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 50 లక్షల ఓట్లు వస్తే అందులో 37 శాతం అమెరికన్లవే. భారత్ నుండి 17 శాతం ఓట్లు వచ్చాయట.. కానీ విచిత్రంగా టైమ్ ఎడిటోరియల్ బోర్డు పాఠకుల అభిప్రాయాన్ని పక్కన పెట్టింది. 
అయోధ్య రామజన్మ భూమి ఉద్యమం భారత దేశ చరిత్రను మలుపు తిప్పింది.. ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. బ్రిటన్ కు చెందిన BBC 1990లో నిర్వహించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్ సర్వేలో నాటి బీజేపీ సారధి లాల్ క్రిష్ణ అడ్వానీకి పాఠకులు అత్యధిక సంఖ్యలో ఓటేశారు. కానీ ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ఎంపికయ్యాడు.. ఇందుకు BBC చూపిన సాకు కూడా విచిత్రంగా అనిపించింది. అడ్వానీకి మద్దతుగా వచ్చిన ఓట్ల తాలూకు పోస్టల్ కవర్లు ఒకే రంగులో ఉన్నాయట..
కొద్ది వారాల క్రితమే భారత దేశం మంగళ్ యాన్ విజయవంతం చేయడం తెలిసిందే.. అంగారక గ్రహంపై తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపి ప్రపంచ వ్యాప్త ప్రశంసలు అందుకున్నారు భారత శాస్త్రవేత్తలు.. పాపం ఇది THE NEW YARK TIMES పత్రిక వారికి నచ్చలేదు కాబోలు.. ఒక భారతీయ పశువుల కాపరి Elite Space Club డోరు తడుతున్న కార్టూన్ ప్రచురించింది.. అయితే భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని గ్రహించి ఆ తర్వాత క్షమాపణలు చెప్పుకుంది..

మనం మొదట చెప్పుకున్న TIME పత్రిక నరేంద్ర మోదీపై మొదటి నుండీ శీతకన్ను వేసినట్లే కనిపిస్తోంది.. గతంలో 2012 మోస్ట్ వాంటెడ్ అంటూ మోదీని చిత్రీకరించే ప్రయత్నం చేసింది.. ఆ తర్వాత కాలంలో ఆయన ఇండియా ప్రధాని కావడం ఖాయమని గ్రహించి, Modi meas business అనే కవర్ పేజీ స్టోరీని కాస్త అటూ ఇటూ అల్లి కవర్ చేసుకుంది.. ఈ ఉదాహరణలన్నీ అంతర్జాతీయ మీడియాకు భారత దేశం, బీజేపీలపై ఉన్న వక్రదృష్టికి అద్దం పడుతున్నాయి..

No comments:

Post a Comment