Saturday, December 6, 2014

గూడు లేని రామచంద్రుడు..

పాపం అయోధ్యలో రాం లాలా దుస్థితి చూడండి.. వివాదాస్పద కట్టడం నేల కూలి నేటికి 22 ఏళ్లు గడచిపోయింది.. మందిరమో, మసీదో అప్పటి దాకా ఉన్న గూడు కూడా పోయింది.. తన జన్మభూమిలో టెంటులో కాందీశీకునిగా మారిపోయాడు శ్రీరామ చంద్రుడు..
కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటూ అక్కడ తాత్కాలికంగా అయినా నిర్మాణాలకు అనుమతించడం లేదు.. దశాబ్దాల తర్వాత ఫైజాబాద్ కోర్టు తీర్పు ఇచ్చినా, మళ్లీ అపీల్ కు పోయారు కక్షిదారులు.. ఇక ఇప్పట్లో ఈ కేసు తేలేనా అనిపిస్తోంది.. అయోధ్య కేసు విషయంలో ప్రధాని దివంగత పీవీ నరసింహారావు అనేవారు కొన్ని సమస్యలను కాలమే పరిష్కరించాలని.. ఆయన ఎందుకు అలా అన్నారో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు.. కాలం గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు తగ్గి సమస్యను జనం మరచిపోతారు.. అప్పుడు ప్రశాంతంగా సమస్యను తేల్చేయొచ్చు..
అయోధ్య విషయంలో ఇప్పుడు ఎవరికీ పెద్దగా పట్టింపు లేదు.. గతంలో అక్కడ ఒక ఆలయం తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలను కోర్డు కూడా నిర్ధారించింది.. ఈ కేసు ప్రధాన కక్షిదారు కూడా మనసు మార్చుకొని ఆలయ నిర్మాణానికి అంగీకరిస్తున్నారు మరి సమస్యను సాగదీయండం ఎందుకు? భవ్య రామమందిరం నిర్మించడంలో ఆంతర్యం ఎందుకు?.. కొన్ని పార్టీలు సంస్థలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అయోధ్య అంశాన్ని సాగదీస్తున్నాయి.. న్యాయస్థానాలు తర్వగా సమస్యను పరిష్కరించాలని భవ్య రామమందిరం మన జీవిత కాలంలోనే సాధ్యం కావాలని కోరుకుందాం.. జై శ్రీరాం..

No comments:

Post a Comment