Saturday, August 31, 2013

ఈయనకు బాధ్యత లేదా?..

నేను దొంగనా? అని బాధ పడ్డారు.. బొగ్గు కుంభకోణం ఫైళ్లు పోతే నేనేం చేయాలి, నేను కాపలా దారుడినా? అంటూ అమాయకంగా ప్రశ్నించారు.. ఆర్థిక సంక్షోభానికి మేమా కారణం? ఉల్లి ధర పెగితే మాదా బాధ్యత అంటున్నారీ పెద్ద మనిషి.. బంగారం ధర పెరిగినా, రూపాయి ధర పతనమైనా తనకు సంబంధం లేదన్నట్లు తేల్చేశారు.. అన్నింటికీ బీజేపీయే కారుణం, వారి వల్లే సంస్కరణలకు అవరోధం ఏర్పడిందని దుమ్మెత్తి పోశారు.. రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడిన తీరు ఇది..
ప్రధానమంత్రి మట్లాడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, బాధ్యతా రహితంగా కూడా ఉంది.. అధికారంలో ఉన్నవారు, దేశాన్ని పరిపాలించే నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి.. కానీ తమకేదీ సంబంధం లేదని చాటు కోవడం మన్మోహన్ చేతగాని తనాన్ని స్పష్టంగా బయట పెడుతోంది.. ప్రతిపక్షం అన్నప్పుడు అధికారంలో ఉన్నవారిని నిలదీయడం సహజం.. జవాబు చెప్పడం అధికారంలో ఉన్నవారి విధి..
తొమ్మిదేళ్ల యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ తన పాలనలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? తనకేమీ సంబంధం లేదని తప్పించుకునే బదులు పదవిని త్యజిస్తేనే మంచిది కదా? 2014 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని సర్వేలన్నీ చెబుతున్నాయి.. అప్పడు కాంగ్రెస్ నాయకులంతా బలిపశువును చేసేది మన్మోహన్ సింగ్ గారినే.. గతంలో పీవీ నరసింహారావు పరిస్థితి ఏమైంది? రావు గారికి పట్టిన దుస్థితి సింగ్ గారికి పట్టక ముందే తెలివైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమమేమో?..

No comments:

Post a Comment