Friday, August 30, 2013

బరితెగించిన బర్మా..

మన నాయకుల అసమర్ధత ప్రపంచానికి తెలిసిపోయింది.. నిన్నటి దాకా పాకిస్తాన్, చైనాలు మన సరిహద్దులను కబలిస్తే, ఇవాళ మయన్మార్(బర్మా) కూడా తెగించింది.. మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లా మోరే పట్టణ సమీపంలోని హాలెన్ ఫాయ్ గ్రామంలోకి చొరబడి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది మణిపూర్.. పొరుగు దేశానికి బుద్ది చెప్పాల్సిన భారత ప్రభుత్వం ఎప్పటిలాగే..'మమన్మార్ తో ఈ విషయాన్ని చర్చించి సామరస్యంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తాం' అంటూ చిలుక పలుకులు పలికింది..
దేశ సరిహద్దులను కాపాడుకోలేని మన దౌర్భగ్య పరిస్థితికి ఈ బలహీన దేశం చక్కగా ఉపయోగించుకుంది.. పాకిస్తాన్, చైనాలను మనం గట్టిగా బుద్ది చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? మన నాయకుల అతి మంచితనాన్ని బలహీనతగా భావించిన పొరుగు దేశాలు కాలరెగరేస్తున్నాయి..
మన బలహీన విదేశాంగ విధానం కారణంగా ఒకప్పుడు మనకు ఎంతో సన్నిహితంగా ఉంటూ, పెద్దన్నగా గౌరవించిన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు క్రమంగా చైనాతో స్నేహం  ప్రారంభించి ప్రయోజనాలు పొందుతున్నాయి.. భూటాన్ విషయంలోనూ మన ప్రభుత్వం ఇటీవల తప్పు చేస్తోంది.. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తుల్లో దేశ సరిహద్దులు మరింత ప్రమాదంలో పడతాయి.. ఇప్పటికైనా భారత విదేశాంగ విధానంలో మార్పు రావాలి..


No comments:

Post a Comment