Sunday, August 11, 2013

తెలంగాణ, సీమాంధ్ర రెండూ అభివృద్ధి చెందాలి..

తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి.. సీమాంధ్రలో నూతన రాజధాని హైదరాబాద్ ను మించిన అభివృద్ధి సాధించగలదు.. ఈ రెండూ గుజరాత్ కన్నా ఎక్కువ అభివృద్ధి సాధించగలవు.. ఇరు ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి తమ ప్రాంతాలను అభివృద్ది చేసుకోవాలి.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్ర ప్రజలు బయటకు రావాలని మనసారా కోరుకుంటున్నారు.. నాకు తెలంగాణ ఎంత ముఖ్యమో, సీమాంధ్ర కూడా అంతే ముఖ్యం.. కాంగ్రెస్ మాయలో పడి ఇరు ప్రాంతాల ప్రజలు ఘర్షణకు దిగరాదు.. ఒకరినొకరు నిందించుకునే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కలిపించింది.. 2004లోనే తెలంగాణ ప్రక్రియను ఎందుకు ప్రారంభించలేదు.. ఓట్ల కోసం విభజించు పాలించు అనే విధానంలో భాగంగానే కాంగ్రెస్ తెలంగాణ ప్రక్రియను ఆలస్యంగా ప్రారంభించడం వల్లే సమస్యలు వచ్చాయి..  కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ది కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను..
(హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో జరిగిన నవభారత యువభేరీ సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలోని ఓ భాగమిది)

No comments:

Post a Comment