Wednesday, July 3, 2013

చిత్రగుప్త ఆలయం

మన పురాణాల ప్రకారం చిత్రగుప్తుడు.. యమధర్మ రాజుకు సహాయకుడు. మన జనన మరణాలు, పాపపుణ్యాల లెక్కలు రాస్తుంటాడు.. Chief Accountant అనుకోవచ్చు..ఈ లెక్కల ఆధారంగానే మరణానంతరం యమ లోకంలో శిక్షలుంటాయి..  చిత్ర గుప్తునికి ఐరావతి, దక్షిణ అనే ఇద్దరు భార్యలున్నారు.. వీరికి 12 మంది సంతానం..


మన దేశంలో యుగయుగాలుగా గణక (Accountant) వృత్తిలో ఉన్న కాయస్తులకు చిత్రగుప్త మహారాజు కుల దైవం.. కాయస్తులు మన దక్షిణ భారత దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు.. కానీ ఉత్తరాదిన ఈ కులస్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితరులు కాయస్తులే..


హిందూ దేవుళ్లలో చిత్రగుప్తుడు కూడా ఉన్నా, ఆయనకు దేవాలయాలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.. . మన రాష్ట్రంలో చిత్రగుప్తునికి ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదు.. అదెక్కడో తెలుసా.. హైదరాబాద్ పాత బస్తీలోని కందికల్ గేట్.. ఇది నేను పుట్టి పెరిగిన ప్రాంతంగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతుంటాను..


కందికల్ గేట్ ప్రాంతంలోని శ్రీ చిత్రగుప్త దేవాలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉంది.. ఉత్తరాది నుండి కొన్ని శతాబ్దాల క్రితం వలస వచ్చిన కాయస్తులు నిర్మించిన ఆలయం ఇది..  ఎంతో మంది భక్తులు ఒక్కడికి వచ్చి తమ దోషాల నివారణ కోసం చిత్రగుప్త మహారాజుకు పూజలు చేస్తుంటారు.. బుధవారం నాడు ప్రత్యేక అభిషేకం, కేతు దోష నివారణ పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు.. దీపావళి తర్వాత రోజు వచ్చే యమ ద్వితీయ చిత్రగుప్తుని జన్మదినం.. ఆ రోజున భోజ్ దోజ్ పేరిట ఉత్సవం నిర్వహిస్తారు.. కాలక్రమంలో చిత్రగుప్త దేవాలయ ప్రాంగణంలో శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సాయిబాబా గుడి కూడా వచ్చాయి..





No comments:

Post a Comment