Wednesday, July 24, 2013

రోజుకు రూ.33.33 సంపాదనతో బతకగలరా?

దేశంలో పేదలు తగ్గారట 2004-05తో 37.2 శాతం పేదలు ఉంటే 2011-12 నాటికి 21.9 శాతం మందే పేదలు కనిపించారట.. అంటే 15.3 శాతం పేదరికం తగ్గినట్లు.. ప్రజల తలసరి ఆదాయం పెరగడ వల్లే పేదరికం తగ్గిందట.. ప్రణాళికా సంఘం తాజాగా వెల్లడించిన లెక్కలు ఇవి..
నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను.. ఈ లెక్కలు తయారు చేసిన వారికి సిగ్గుందా? అని.. ఈ 7,8 ఏళ్ల కాలంలో ప్రజల జీతాలు ఎంత పెరిగాయి? నిత్యావసర వస్తువులు, ఇతర ఖర్చులు ఏ మేరకు పెరిగాయి? ఈ లెక్కలు తీశారా అసలు.. పెరిగిన జీతాలు, సంపాదనకు ఖర్చులకు పొంతన ఏమాత్రం లేదు..
గతంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా సెలవిచ్చిందేమిటంటే.. కూడు, గుడ్డ, గూడు కలిపి పట్టణాల్లో రూ. 33.33, గ్రామాల్లో రూ. 27.20 సంపాదించుకోగలిగితే హాయిగా బతికేయొచ్చట.. నెలకు రూ.1,000/- ఖర్చు చేసే స్థితిలో ఉన్న వారు పేదరికం నుండి బయట పడినట్లేనట..
మన దేశాన్నేలుతున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా చేతిలో రూ.33.33 చొప్పున పెట్టి భారత దేశంలో ఏ గ్రామమైనా, పట్టణమైనా వెళ్లి ఒక రోజు బతికి చూపమనండి.. అయితే ఓ కండిషన్ వారు ఎక్కడా తమ హోదాలు, పరపతిని ఉపయోగించుకోకుండా సామాన్య ప్రజల్లాగే ఖర్చు చేయాలి.. ఈ డబ్బుతో వారు తమ ఆకలి తీర్చుకొని, గూడు, గుడ్డ కల్పించుకోగలిగితేనే ఒప్పుకుందాం దేశంలో పేదరికం తగ్గిందని..

పార్లమెంటు క్యాంటీన్లో కాకా హోటల్ కన్నాకారు చౌకగా ఆహార పదార్థాలు దొరుకుతాయట.. నిజమే అక్కడ పేదవారు ఎక్కువ కదా?

No comments:

Post a Comment