Friday, July 12, 2013

అంతులేని కథ.. తెలంగాణ

ఏదో తేల్చేస్తామన్నారు.. అందరూ నమ్మేశారు.. ప్రత్యేక రాష్ట్రం వస్తుందని తెలంగాణ నాయకులు సంబర పడ్డారు.. సమైక్యాంధ్రను విడగొడితే ఊరుకునేది లేదని సీమాంధ్ర నేతలు బెదిరించారు.. కానీ జరిగిందేమిటి?.. కాంగ్రెస్ కోర్ కమిటీ ముగ్గురు నాయకుల దగ్గర రోడ్డు మ్యాపులు తీసుకొని వర్కింగ్ కమిటీలో చర్చిస్తామని చల్లగా చెప్పేసింది..
తెలంగాణ సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకి ఏ కోశానాలేదని మరోమారు స్పష్టంగా తేలిపోయింది.. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే ఇన్ని నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు..   
తెలంగాణను కాంగ్రెస్ అంతులేని కథగా మార్చేసింది.. కాంగ్రెస్ తనకు ప్రయోజనం లేనిదే ఏ పనీ చేయదు.. వారి ఓట్ల లెక్కలకు తెలంగాణ ప్రజలు పదే పదే మోసపోతున్నారు.. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని గుర్తు తెచ్చుకోండి..
మొదటి తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి ద్వారా వెన్నుపోటు పొడిపించారు..
తెలంగాణ ఇస్తామంటే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనేశారు..
రెండో ఎస్సార్సీ అన్నారు.. నిజంగా అది వేశారా? లేదు.  
శ్రీకృష్ణ కమిటీ అన్నారు.. కమిటీ నివేదికను అటక మీద భద్రంగా పెట్టేశారు..
రాయల తెలంగాణ అట.. అసలు అడిగిందెవరు?
తాజాగా రోడ్డు మ్యాపులు, కోర్ కమిటీ అన్నారు.. జరిగిందేమిటో చూశారు కదా?
వద్దు.. ఒక వద్దే వద్దు.. ఎన్నాళ్లీ మోసం?
తెలంగాణ ఒకరు దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది, వచ్చేది కాదు.. పోరాడి సాధించాల్సిందే..

No comments:

Post a Comment