Sunday, July 14, 2013

ఇటలీ వారికి ఎందుకింత అలుసు..

బోఫోర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఒట్టావియా ఖత్రోచి తన స్వదేశం ఇటలీలోని మిలన్ నగరంలో మరణించాడనే వార్త చూశాక ఆయన గురుంచి, మన భారత రాజకీయ వ్యవస్థ గురుంచి కాస్త రాస్తే మంచిదనిపించింది..  కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇటలీ అంటే ఎందుకో ప్రేమ.. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుటుంబానికి ఖత్రోచి కుటుంబ మిత్రుడు.. ఇటలీకి చెందిన సోనియా గాంధీ కారణంగానే ఆయనకు రాజీవ్ కుటుంబంతో బంధం ఏర్పడటం, అది బోఫోర్సు ఆయుధాల కుంభకోణానికి దారి తీయడం.. ఖత్రోచికి కాపాడే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావడం(1989) చరిత్ర.. కాంగ్రెస్ అండదండలతోనే ఆయన దేశం విడచి పారిపోయి, అరెస్టు వారెంట్లను తప్పించుకోవడం తెలిసిందే.. నిజంగా ఆయన నిర్ధోషి అయితే చట్టం నుండి తప్పించుకోవడం ఎందుకు?
కానీ ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఖత్రోచి నిర్దోషి అని వాదిస్తారు.. ఆయన చట్టానికి దొరికితే డొంక కదిలి అసలుకే ఎసరు పడుతుందని వారి భయం..

కొద్ది నెలల క్రితం అరేబియా సముద్రంలో భారత జాలర్లను కాల్చి చంపి అరెస్టయిన ఇటలీ జాలర్లు బెయిల్ మీద స్వదేశానికి పోయి, తిరిగి రావడానికి ముప్పు తిప్పలు పెట్టారు.. దౌత్య పరమైన వత్తిడితో వారు తిరిగి రాక తప్పలేదు..
ఖత్రోచి, ఈ నావికులు ఉదంతాలు చూస్తుంటే ఇటలీ వానికి భారత దేశం అంటే ఎంటే ఎంత చులకనో అర్ధం అవుతుంది.. అసలు వారికి ఎందుకు కింత అలుసు.. కారణాలు అందరికీ తెలిసినవే..


No comments:

Post a Comment