Wednesday, July 17, 2013

రూ.5 చెల్లిస్తే తప్పేమిటి?..

హైదరాబాద్ లో జరగబోయే నరేంద్రమోడీ సభకు బీజేపీ రూ.5 రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేక పోతున్నారు.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ధనమయం చేస్తోందని గగ్గోలు పెట్టేస్తున్నారు.. ఈ రిజిస్ట్రేషన్ ఫీజుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే బీజేపీ కార్యకర్తలకు, హాజరయ్యేవారికి ఉండాలి కానీ కందకు లేని దురద కత్తికి ఎందుకో అర్థం కావడంలేదు.. బహుషా వారు కూడా మోడీ సభకు రావాలనుకొని రూ.5 చెల్లించలేని దుర్భర దారిద్ర్యం వల్ల రాలేకపోతున్నారా?.. పర్వాలేదు.. బీజేపీ కార్యకర్తలే చెల్లించి వారి ముచ్చట తీరుస్తారు.. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా వచ్చే మొత్తాన్ని ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఇస్తామని, ఇది నిర్భందమేమీ కాదని బీజేపీ నేతలు ఇప్పటికే సెలవిచ్చారు.. ఒక సదాశయంలో తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శల్లోని ఔచిత్యం ఏమిటో నాకైతే అర్థం కాలేదు..
సాధారణంగా రాజకీయ సభలకు జనాలను తోలుకు రావడానికి ఒక రోజు కూలీ, మద్యం, తిండి ఇస్తారనేది అందరికీ తెలసిన బహిరంగ రహస్యం.. కానీ నరేంద్ర మోడీ సభకు బీజేపీ ఎదురు డబ్బు చెల్లించే అవకాశం ఇవ్వడం గమనిస్తే ఈ సభపై పెట్టుకున్న అంఛనాలను అర్థం చేసుకోవచ్చు.. భారత రాజకీయాల్లో ఇదొక సరికొత్త ట్రెండ్.. ప్రజల నుండి పారదర్శకంగా విరాళం తీసుకోవడంలో తప్పేమీ లేదని చెప్పక తప్పదు..
సాధారణంగా ఫ్లాప్ సినిమాలకు విలువ ఉండదు.. కానీ కాంగ్రెస్ నాయకులు రూ.200-500 దాకా వెచ్చించి చూస్తారట (మనీష్ తివారీ ప్రకటన చూడండి).. తాము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సభలకు రూ.5 వసూలు చేయబోమని చిదంబరం గారు సెలవిచ్చారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వారికి సీనుందా? వసూలు చేసి చూడండి ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది కదా?

1 comment: