Sunday, January 20, 2013

ఎవరు దేశభక్తులు? ఎవరు తీవ్ర వాదులు?


కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చూసిన తర్వాత అసలాయన ఆ పదవికి అర్హుడేనా అనే అనుమానం వచ్చింది.. దేశంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ఈ పెద్ద మనిషి తన బాధ్యతలను ఎంత వరకు నిర్వహిస్తున్నారో తెలియదు కాని, ఒక గొప్ప రహస్యాన్ని కానీ పెట్టారు.. బీజేపీ, ఆరెస్సెస్ శిబిరాల్లో హిందుత్వ తీవ్రవాద శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయట.. 
షిండే ప్రకటన చూసిన తర్వాత మన ఇంటలిజెన్స్ ఎంత సమర్దవంతంగా పని చేస్తోందో అర్థం అవుతోంది.. ఈ దేశంలో కోట్లాది మంది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు ఉన్నారు.. షిండే గారి ప్రకటన అనుసారం వారంతా తీవ్ర వాదులే.. బహుషా దేశ భక్తీ షిండే గారి దృష్టిలో తీవ్రవాదం కావచ్చు.. భారత్ మాతాకీ జై అంటే తప్పేమో.. 
హిందువుల పవిత్ర దినమైన సంక్రాంతి రోజే ఒక మతాచార్యున్ని పుణ్య క్షేత్రంలో అరెస్ట్ చేసి సెక్యులరిస్ట్ నిష్టను ప్రదర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ, హిందూ మతాన్ని నిష్టగా ఆచరించే వారిని తీవ్రవాదులుగా భావించడంలో ఆశ్చర్యం ఏమి కలగడం లేదు.. పార్లమెంట్ పై దాడి కేసు నిందితుడిని ఉరి తీయకుండా ఇంటి అల్లుడిగా కాపాడుతున్న కాంగ్రెస్ నాయకులు గొప్ప దేశ భక్తులేమో.. ఇద్దరు భారతీయ జవాన్లను దారుణంగా చంపిన పొరుగు దేశంకు గట్టిగా బుద్ది  చెప్పడం చేతగాని పాలకులు కూడా గొప్ప దేశ భక్తులే.. కాని ఈ భారత దేశం తప్ప సొంత దేశం లేని హిందువులకు ప్రాతినిద్యం వహిస్తున్న పాపానికి పై సంస్థలు, వ్యక్తులు తీవ్రవాదులు అయిపోయారు.. 
పేరు చెప్పను కాని కొందరు వ్యక్తులు పిచ్చాసుపత్రిలో ఉండటానికే అర్హులు.. కాని ఏకంగా అత్యన్నత పదవుల్లో కూర్చొని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.. వినాష కాలే విపరీత బుద్ది.. హే  భగవాన్.. హిందువులను, నా దేశాన్ని ఇలాంటి సూడో  సెక్యులరిస్ట్ ల నుండి కాపాడు..

No comments:

Post a Comment