Friday, January 4, 2013

సెక్యులర్ పార్టీలు నిద్ర పోతున్నాయా?

నిర్మల్ బహిరంగ సభలో అక్బరుద్దీన్  ప్రసంగాన్ని యూట్యూబ్లో చూసిన తర్వాత  ఇలాంటి వ్యక్తులు పిచ్చాసుపత్రిలో ఉండటమే మంచిది అనిపిస్తోంది.. పోలీసులు పదిహేను నిముషాలు అందుబాటులో లేకుంటే వంద కోట్ల హిందువులను ఖాతం చేస్తారట.. ఈ పిచ్చోడికి హిందూస్తాన్ మీద అంత ద్వేశం ఉంటె పాకిస్తాన్ పోవడమే మంచిది.. హిందువులను, హిందూ దేవతలను, గోమాతను ఇంత బహిరంగంగా తిట్టిన ఈ నీచుడిని అరెస్ట్ చేసి బొక్కలో తోయడానికి ప్రభుత్వం ఎందుకు జంకుతోంది.. కోర్టులు జోక్యం చేసుకొని ఆదేశిస్తే కానీ పోలీసులు కేసు పెట్టారా? 
నా ముస్లిం స్నేహితుల్లో కొందరు మజ్లిస్ సానుభూతి పరులు ఉన్నారు.. అక్బర్ మాటలకు వారే సిగ్గుపడి పోతున్నారు.. నిర్మల్ సభ విశేషాలు వెలుగులోకి వచ్చి నాలుగైదు రోజులు గడచినా అక్బరుద్దీన్ వివాదాస్పద ప్రసంగాన్ని పత్రికలూ, ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గు చేటు..ఎం.ఐ.ఎం. ముస్లింలకు ఏకైక ప్రతినిధి ఎంత మాత్రం కాదు.. ఈ వాస్తవం తెలిసి కూడా ఇతర రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు.. వారికీ హిందువుల మనోభావాలు పట్టవా? వారి ఓట్లు మాత్రమే కావాలా? సోకాల్డ్ సెక్యులర్ పార్టీలను నిలదీయండి..

No comments:

Post a Comment