Tuesday, January 22, 2013

ఒక జ్ఞాపకం.. ఒక ఆందోళన

పోలవరం ప్రాజెక్ట్ కడితే పాపికొండలు, భద్రాచలం, పర్ణశాల మునిగి పోతాయి తెలుసా?.. 
గత నాలుగేళ్ళుగా ఎక్కడ విన్నా ఇదే చర్చ.. మునిగి పోతాయో లేదో తర్వాత విషయం కాని ముందు ఈ ప్రాంతాలను చూసి రావాలన్న కోర్కె తీరింది.. పాపి కొండలు చూసేందుకు నా కుటుంబం, బంధువులతో కలిసి  గోదావరిలో లాంచి ప్రయాణం చేశాను.. గోదావరిలో నీరు తక్కువే ఉన్నా ఇదో అద్భుత యాత్ర.. సెల్ ఫోన్ల రణగొణలకు, కాలుష్యానికి దూరంగా ప్రకృతి వడిలో లాంచీ నదిలో విహారం..  పొగ మంచులో దోబూచు లాడిన పాపికొండలను చేరే సరికి గోదావరి ఇరుకై పోయింది.. కాని లోతు పెరిగింది.. 

పోలవరం(ఇందిరా సాగర్) ప్రాజెక్ట్ రెండు కిలో మీటర్ల పొడువు, అర కిలోమీటర్(?) ఎత్తులో కడుతున్నారని మా టూర్ ఆపరేటర్ గైడ్ చెప్పాడు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భద్రాచలం, పాపికొండలు, పర్ణశాల సహా ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో కొన్ని వందల గ్రామాలు మినిగి పోతాయట.. అదే సమయంలో కొన్ని వేల ఎకరాలకు సాగు నీరు అందుబాటులోకి వస్తుందట.. సాగు నీటి సదుపాయం సంగతి దేవుడెరుగు.. అనీ వందల గ్రామాల ప్రజలను నిర్వాసితులను చేయడం అవసరమా అనిపించింది.. 
అసలు అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాల సంస్కృతీ, సంప్రదాయాలను కబలించడం.. జీవ వైవిధ్యానికి నిలయం అయిన పాపికొండలను ముంచడం సమంజసమేనా?.. రాముల వారు కొలువైన భద్రాచలం, అరణ్య వాసం గడపిన పర్ణశాల మునిగి పోతాయంటే జీర్ణించుకోలేక పోయాను.. 
 ఎనిమిది గంటల నదీ విహారం మరపురాని జ్ఞాపకాన్ని మిగిల్చింది.. దీనితో పాటు కొంత పోలవరం ముంపు తాలూకు అందోళన బాధించింది..

1 comment: