Friday, January 11, 2013


అమెరికా చట్టసభకు ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ తులసీ గబార్డ్.. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా చట్టసభలో బైబిల్ బదులుగా భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డ్ నెలకొల్పారు.. ఇది కేవలం హిందువులకే కాదు భారతీయులందరికీ గర్వకారణం.. ఏమాత్రం భారతీయ మూలాలు లేకుండా, అమెరికాలో పుట్టి పెరిగిన తులసీ గబార్డ్ చిన్నప్పటి నుండీ హిందూ మత విశ్వాసి.. భగవద్గీత అన్ని విధాలా తనకు స్పూర్తిగా నిలచిందని చెబుతున్నారు తులసీ గబార్డ్.. స్వధర్మాన్ని వదిలి అన్య మతాల వెంట పడుతున్న హిందువులకు ఆమె కనువిప్పు కలిగిస్తుందని భావిస్తున్నాను..

ఇక రెండో వ్యక్తి విషయానికి వద్దాం.. రాజ్ కేశ్వర్ పరియాగ్ కుటుంబం మూడు తరాల క్రితమే భారత దేశం వదిలేసి బతుకు తెరువు కోసం మారిషస్ తోటల్లో కూలీలుగా పని చేయడానికి వెళ్లింది.. ఆ నాదడు రాజ్ కేశ్వర్ మారిషస్ దేశానికి అధ్యక్షుడైపోయారు.. అయినా ఆయనను తన పూర్వీకుల జన్మభూమి గుర్తుకొచ్చింది.. భారత దేశ పర్యటనకు వచ్చిన మారిషస్ అధ్యక్షుడు బీహార్ రాజధాని పట్నాకు 200 కిలో మీటర్ల దూరంలోని తన పూర్వీకుల గ్రామం వాజీద్ పూర్ వెళ్లారు.. పూర్వీకుల జన్మభూమిని చూసి చలించిపోయి వలవలా ఏడ్చేశారు..


ఈ రెండు వార్తలు తెలుగు పత్రికల్లో ప్రముఖంగానే వచ్చినా,  గమనించని వారి కోసమే నేను పోస్ట్ చేస్తున్నాను..

No comments:

Post a Comment