Thursday, January 3, 2013

ఎం.ఐ.ఎం. అంటే ఎందుకు భయం?

హైదరాబాద్లో మత సామరస్యం దెబ్బ తీసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెంచుకోవాలని ఎం.ఐ.ఎం. ప్రయత్నిస్తోంది.. ఇందులో భాగంగా భాగ్యలక్ష్మి ఆలయ అంశాన్ని వివాదాస్పదం చేయాలనీ చూసి భంగ పడింది.. తన పన్నాగం బెడిసి కొట్టేసరికి మరింత రెచ్చి పోయింది అందులో భాగమే అక్బరుద్దీన్ ఒవైసి మితిమీరిన ప్రసంగాలు..
అక్బరుద్దీన్ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ ప్రసంగిస్తే బీ.జే.పీ. తప్ప మరే రాజకీయ పార్టీ స్పందించకపోవడం దురదృష్టకరం.. రాజకీయ పార్టీలు ఎం.ఐ.ఎం.ను చూసి భయ పడుతున్నాయా?.. హిందువుల మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాయా? స్పష్టం కావాల్సిన అవసరం ఉంది.. బీ.జే.పీ. మాత్రమే ఎందుకు స్పందించాలి? ఇదెక్కడి సెక్యులరిజం? 
హిందూ దేవతలను, హిందువులను కించ పరుస్తూ అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాలను ప్రతి భారతీయుడు ఖండించాల్సిందే.. హిందువుల సహన శీలతను అక్బరుద్దీన్ లాంటి మతోన్మాదులు బలహీనతగా భావిసున్నారు..  మత  సామరస్యాన్ని దెబ్బ తీస్తున్న అక్బరుద్దీన్ను అరెస్ట్ చేయడానికి  ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఇలాంటి దేశ ద్రోహులను వెంటనే అరెస్ట్ చేయాలి..

No comments:

Post a Comment