Friday, January 25, 2013

కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే..

సొంత రాష్ట్రం కశ్మీర్లో తీవ్రవాదాన్ని ఎదుర్కొనే జాదూ తెలియని గులాం నబీ..
అరవ దేశంలో తంబీల ముందు అరవ లేన సీట్లు సర్దుకొని గెలిచే చిదంబరం..
మళయాళీ కంగాళీ కాంగ్రెస్ గ్రూపుల్లో టోన్ లేని ఆంటోనీ, వయలార్ రవి..
గుజరాత్ గల్లీల్లో మోడీని ఢీకొట్టలేక ఢిల్లీ అమ్మోరి సేవకే పరిమితమైన అహ్మద్ పటేల్..
మధ్య ప్రదేశ్ లో టికానా కోల్పోయిన దిగ్విజయ్ సింగ్..
ఉగ్రవాదానికి, దేశ భక్తికి తేడా తెలియక సెన్స్ లేకుండా మాట్లాడి విలువ తగ్గించుకున్న సుశీల్ కుమార్ షిండే..
సొంతంగా దేశాన్ని పాలించలేక, నిర్ణయం తీసుకునే శక్తిలేక మౌనీ మన్మోహన్ బాబాకు పగ్గాలు ఇచ్చేసిన సోనియా గాంధీ..
వీరేనా తెలంగాణా సమస్యను పరిష్కరించే కాంగ్రెస్ అధిష్టానం నాయకులు?..
తెలంగాణ సమస్యకు ఈ నెల 28లోపు పరిష్కరిస్తామని షిండే అంటే, ఆ తేదీలోపు తేల్చడం అసాధ్యమని ఆజాద్ తేల్చారు.. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అనీ మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేసిన టీ.కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అగ్రనేతల వైఖరితో బిత్తరపోతున్నారు.. చూడబోతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేలా లేదు.. ఈ నాయకులు తెచ్చేలా లేరు..
కోదండరాముడు అన్నట్లు వీరందరికీ కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే..

No comments:

Post a Comment