Friday, January 11, 2013

స్పూర్తిదాత.. వివేకానంద..


ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ నాలుగు పదులైనా నిండని జీవితంతో భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు.. స్వామీ వివేకానంద 150 ఏళ్ల జయంత్యుత్సవాలను ప్రపంచమంతా ఘనంగా జరుగపుకుంటోంది.. స్వామీజీ బోధనలు క్లుప్తంగా గుర్తు చేసుకుందాం..
‘లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరే వరకూ విశ్రమించకండి..’ అంటూ యువతకు కర్తవ్యాన్ని సూచించారు స్వామీజీ.. ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అని చెప్పారు.. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత’ ఈ దేశానికి కావాలన్నారు.. ‘దరిద్రుల సేవే నారాయణ సేవ’ అని ఉద్బోధించారు.. ‘నా దేశంలో కుక్క సైతం ఆకలితో చావద్దు’ అని సూచించారు..
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు స్వామీజీ.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు వివేకానంద.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి..కానీ స్థూలంగా పరిశీలించి చూడండి.. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా సారాంశం ఒకటే.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి స్వామీజీ చక్కని బోధనలు చేశారు.. ఆయన బోధనలు చదివితే చాలు, మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీ వివేకాంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..
స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం..

No comments:

Post a Comment