Saturday, January 12, 2013

ప్రతి భారతీయుడు ఆలోచించాలి..

మన దేశం స్వతంత్రం సాధించిన తర్వాత ఎన్నడూ  ఇంతటి దౌర్భాగ్య విదేశాంగ విధానాన్ని చూసి ఉండక పోవచ్చు.. పాకిస్తాన్ సైన్యం బరి తెగించి ఇద్దరు భారతీయ సైనికులను పాశవికంగా చంపినా యు.పి.ఎ. పాలకుల్లో కనీస చలనం లేదు.. నామ మాత్రపు నిరసన తెలిపి ఊరుకుంది.. బహుశ ప్రపంచ దేశాలు మనను  చూసి నవ్వుకొని ఉండ వచ్చు.. ప్రతి భారతీయుడు సిగ్గుతో తల వంచుకోవాల్సిన దుస్థితి ఇది.. 
పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చ గొడుతున్నా చేతులు ముడుచు కుంటున్నాం.. కసబ్ ను రహస్యంగా ఉరి తీసి చంకలు గుడ్డుకుంటున్నాం.. కాని పార్లమెంట్ పై దాడి కుట్ర దారుడైన అఫ్జల్ గురును ఉరి తీయడానికి ధైర్యం చాలడం లేదు.. అసలు ఈ దుస్థితి అంతటికీ కారణం జవహర్ లాల్ నెహ్రు.. కాశ్మీర్ సమస్య విషయంలో అయన వేసిన తప్పటడుగుల  ఫలితాన్ని ఇప్పుడు భారత దేశం అనుభవిస్తోంది.. కాశ్మీర్ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెల్లడం  ద్వారా శాంతి కాముడిగా పేరు తెచ్చుకుందామని ఆశ పడ్డారాయన.. టిబెట్ ను చైనా ఆక్రమించడాన్ని గుడ్డిగా సమర్దించారు. హిందీ-చీని భాయి భాయి అంటూ మురిశారు.. తీరా చైనా మనపై దాడి చేశాక గాని నెహ్రు గారి భ్రమలు తొలగలేదు.. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లలో చాల భాగాలు పాకిస్తాన్,  చైనా ఆక్రమణలో ఉన్నా గట్టిగా ప్రశ్నించాలేక పోతున్నాం.. 
జనాభా పరంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. కాని అరవై ఏళ్లుగా సరైన విదేశాంగ విధానాన్ని రూపొందించుకో లేక పోయాం.. ఒకప్పుడు మన దేశంపై ఆధార పడ్డ శ్రీలంక, మాల్దీవులు క్రమంగా చైనా ఒడిలోకి పోతున్నాయి.. బంగ్లాదేశ్, నేపాల్, బర్మా కూడా చైనా వైపే చూస్తున్నాయి..

 ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మనకెందుకులే అనుకోకండి.. దేశ భద్రత గురుంచి ఆలోచించడం, ప్రశ్నించడం భారతీయులుగా మన అందరి విధి.. మొన్నటికి మొన్న సాముహిక అత్యాచార సంఘటనపై యువత వీధుల్లోకి వచ్చి గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం దిగి వచ్చింది.. దేశ భద్రత విషయంలో కూడా అలాగే ప్రభుత్వ మెడలు వంచలేమా? ఆలోచించండి..  

Friday, January 11, 2013


అమెరికా చట్టసభకు ఎన్నికైన తొలి హిందూ అమెరికన్ తులసీ గబార్డ్.. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా చట్టసభలో బైబిల్ బదులుగా భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డ్ నెలకొల్పారు.. ఇది కేవలం హిందువులకే కాదు భారతీయులందరికీ గర్వకారణం.. ఏమాత్రం భారతీయ మూలాలు లేకుండా, అమెరికాలో పుట్టి పెరిగిన తులసీ గబార్డ్ చిన్నప్పటి నుండీ హిందూ మత విశ్వాసి.. భగవద్గీత అన్ని విధాలా తనకు స్పూర్తిగా నిలచిందని చెబుతున్నారు తులసీ గబార్డ్.. స్వధర్మాన్ని వదిలి అన్య మతాల వెంట పడుతున్న హిందువులకు ఆమె కనువిప్పు కలిగిస్తుందని భావిస్తున్నాను..

ఇక రెండో వ్యక్తి విషయానికి వద్దాం.. రాజ్ కేశ్వర్ పరియాగ్ కుటుంబం మూడు తరాల క్రితమే భారత దేశం వదిలేసి బతుకు తెరువు కోసం మారిషస్ తోటల్లో కూలీలుగా పని చేయడానికి వెళ్లింది.. ఆ నాదడు రాజ్ కేశ్వర్ మారిషస్ దేశానికి అధ్యక్షుడైపోయారు.. అయినా ఆయనను తన పూర్వీకుల జన్మభూమి గుర్తుకొచ్చింది.. భారత దేశ పర్యటనకు వచ్చిన మారిషస్ అధ్యక్షుడు బీహార్ రాజధాని పట్నాకు 200 కిలో మీటర్ల దూరంలోని తన పూర్వీకుల గ్రామం వాజీద్ పూర్ వెళ్లారు.. పూర్వీకుల జన్మభూమిని చూసి చలించిపోయి వలవలా ఏడ్చేశారు..


ఈ రెండు వార్తలు తెలుగు పత్రికల్లో ప్రముఖంగానే వచ్చినా,  గమనించని వారి కోసమే నేను పోస్ట్ చేస్తున్నాను..

స్పూర్తిదాత.. వివేకానంద..


ఆయన జీవించింది కేవలం 39 ఏళ్లు మాత్రమే.. కానీ నాలుగు పదులైనా నిండని జీవితంతో భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలిచారు.. స్వామీ వివేకానంద 150 ఏళ్ల జయంత్యుత్సవాలను ప్రపంచమంతా ఘనంగా జరుగపుకుంటోంది.. స్వామీజీ బోధనలు క్లుప్తంగా గుర్తు చేసుకుందాం..
‘లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరే వరకూ విశ్రమించకండి..’ అంటూ యువతకు కర్తవ్యాన్ని సూచించారు స్వామీజీ.. ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అని చెప్పారు.. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత’ ఈ దేశానికి కావాలన్నారు.. ‘దరిద్రుల సేవే నారాయణ సేవ’ అని ఉద్బోధించారు.. ‘నా దేశంలో కుక్క సైతం ఆకలితో చావద్దు’ అని సూచించారు..
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం జాతి పునర్ నిర్మాణమే మార్గమని సూచించారు స్వామీజీ.. ధర్మాన్ని పాటించమన్నారు.. స్వధర్మం తల్లివంటిదని, పర ధర్మం సవతి వంటిదని అన్నారు.. ఏ విధంగా చూసినా హిందుత్వమే అన్ని ధర్మాలకన్నా గొప్పదని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో చాటి చెప్పారు వివేకానంద.. ప్రపంచానికి భారత దేశం ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలన్నారు..
నేడు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు మర్కెట్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి..కానీ స్థూలంగా పరిశీలించి చూడండి.. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా సారాంశం ఒకటే.. కానీ వందేళ్ల క్రితమే వ్యక్తి నిర్మాణం గురుంచి స్వామీజీ చక్కని బోధనలు చేశారు.. ఆయన బోధనలు చదివితే చాలు, మరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు.. యువతకు ఆశాజ్యోతి, మార్గదర్శి అయిన స్వామీ వివేకాంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు..
స్వామీ వివేకానందను గుర్తు తెచ్చుకుందాం.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిద్దాం.. ఈ దేశాన్ని పునర్నిర్మిద్దాం..

Friday, January 4, 2013

పేర్లు చెప్పను కాని కొంత మంది స్వాములు హిందూ ధర్మానికి చేసున్న మేలు నయా  పైసా కూడా లేదు.. గడ్డాలు  పెంచుకొని, కాళ్లు మొక్కించుకుంటూ, వ్యక్తిగత ఆస్తులు కూడ బెడుతున్నారు.. హిందూ మతానికి, హిందువులకు జరుగుతున్న అన్యాయాలు మీడియాలో వస్తున్నా పట్టించుకోరు.. పైగా ఒక స్వామి అంటే మరొకరికి పడదు.. అయినా హిందువులు వీరిని గుడ్డిగా ఆరాధిస్తున్నారు.. హే  భగవాన్.. ముందు ఇలాంటి స్వాముల నుండి హిందువులను, హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని రక్షించు.. 

సెక్యులర్ పార్టీలు నిద్ర పోతున్నాయా?

నిర్మల్ బహిరంగ సభలో అక్బరుద్దీన్  ప్రసంగాన్ని యూట్యూబ్లో చూసిన తర్వాత  ఇలాంటి వ్యక్తులు పిచ్చాసుపత్రిలో ఉండటమే మంచిది అనిపిస్తోంది.. పోలీసులు పదిహేను నిముషాలు అందుబాటులో లేకుంటే వంద కోట్ల హిందువులను ఖాతం చేస్తారట.. ఈ పిచ్చోడికి హిందూస్తాన్ మీద అంత ద్వేశం ఉంటె పాకిస్తాన్ పోవడమే మంచిది.. హిందువులను, హిందూ దేవతలను, గోమాతను ఇంత బహిరంగంగా తిట్టిన ఈ నీచుడిని అరెస్ట్ చేసి బొక్కలో తోయడానికి ప్రభుత్వం ఎందుకు జంకుతోంది.. కోర్టులు జోక్యం చేసుకొని ఆదేశిస్తే కానీ పోలీసులు కేసు పెట్టారా? 
నా ముస్లిం స్నేహితుల్లో కొందరు మజ్లిస్ సానుభూతి పరులు ఉన్నారు.. అక్బర్ మాటలకు వారే సిగ్గుపడి పోతున్నారు.. నిర్మల్ సభ విశేషాలు వెలుగులోకి వచ్చి నాలుగైదు రోజులు గడచినా అక్బరుద్దీన్ వివాదాస్పద ప్రసంగాన్ని పత్రికలూ, ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గు చేటు..ఎం.ఐ.ఎం. ముస్లింలకు ఏకైక ప్రతినిధి ఎంత మాత్రం కాదు.. ఈ వాస్తవం తెలిసి కూడా ఇతర రాజకీయ పార్టీలు నోరు మెదపడం లేదు.. వారికీ హిందువుల మనోభావాలు పట్టవా? వారి ఓట్లు మాత్రమే కావాలా? సోకాల్డ్ సెక్యులర్ పార్టీలను నిలదీయండి..

Thursday, January 3, 2013

ఎం.ఐ.ఎం. అంటే ఎందుకు భయం?

హైదరాబాద్లో మత సామరస్యం దెబ్బ తీసి రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెంచుకోవాలని ఎం.ఐ.ఎం. ప్రయత్నిస్తోంది.. ఇందులో భాగంగా భాగ్యలక్ష్మి ఆలయ అంశాన్ని వివాదాస్పదం చేయాలనీ చూసి భంగ పడింది.. తన పన్నాగం బెడిసి కొట్టేసరికి మరింత రెచ్చి పోయింది అందులో భాగమే అక్బరుద్దీన్ ఒవైసి మితిమీరిన ప్రసంగాలు..
అక్బరుద్దీన్ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తూ ప్రసంగిస్తే బీ.జే.పీ. తప్ప మరే రాజకీయ పార్టీ స్పందించకపోవడం దురదృష్టకరం.. రాజకీయ పార్టీలు ఎం.ఐ.ఎం.ను చూసి భయ పడుతున్నాయా?.. హిందువుల మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాయా? స్పష్టం కావాల్సిన అవసరం ఉంది.. బీ.జే.పీ. మాత్రమే ఎందుకు స్పందించాలి? ఇదెక్కడి సెక్యులరిజం? 
హిందూ దేవతలను, హిందువులను కించ పరుస్తూ అక్బరుద్దీన్ చేసిన ప్రసంగాలను ప్రతి భారతీయుడు ఖండించాల్సిందే.. హిందువుల సహన శీలతను అక్బరుద్దీన్ లాంటి మతోన్మాదులు బలహీనతగా భావిసున్నారు..  మత  సామరస్యాన్ని దెబ్బ తీస్తున్న అక్బరుద్దీన్ను అరెస్ట్ చేయడానికి  ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఇలాంటి దేశ ద్రోహులను వెంటనే అరెస్ట్ చేయాలి..

Wednesday, January 2, 2013

సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దాం..

న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశావ్?.. అంటూ ఆరా తీశాడో మిత్రుడు.. దాదాపు నిలదీసినట్లుగా?.. డిసెంబర్ 31న ఆఫీస్లో నైట్ డ్యూటీలో ఉన్నానని చెప్పే సరిగా నా వైపు జాలిగా చూశాడాయన.. గత ఏడాదైతే ఎప్పటిలాగే ఇంట్లో హాయిగా నిద్రపోయానని చెబితే మరింత ఆశ్చర్యపోయాడతగాడు..
31 డిసెంబర్ సెలబ్రేషన్ అంటే ఆ మిత్రుడి దృష్టిలో చక్కగా మందు కొట్టి, అర్థ రాత్రి 12 గంటలు దాటగానే హ్యపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టి చిందులేయడమే.. కొత్త సవంత్సర వేళ మితి మీరి తాగి రోడ్డపై అడ్డదిడ్డంగా వేగంగా వాహనాలు నడిపి తాము ప్రమాదానికి గురవడమే కాకుండా ఎదుటి వారని చావు బతుకుల్లో పడేసిన సంఘటనలేన్నో చూశాను.. ఇలాంటి పనులు అర్థం లేనివనే నేను మొదటి నుండీ విశ్వసిస్తున్నాను.. కొత్త సంవత్సరం అంటే నా దృష్టిలో క్యాలెండర్ మార్పు మాత్రమే.. ఇంత చిన్న వ్యవహారానికి వెర్రి చేష్టలెందుకో మరి?
న్యూ ఇయర్ పేరిట పేరిట కోట్లాది రూపాయల సంపద వృధా అయిపోతోంది.. హోటళ్లు, రిసార్టులు, బేకరీలు, వ్యాపారులు, మీడియాకు ఇదో ఆదాయ వనరుగా మారిపోయింది.. నిజానికి అర్థం పర్థంలేని ఇలాంటి సెలబ్రేషన్లను ప్రమోట్ చేసి వారు జేబులు నింపుకుంటున్నారు.. న్యూ ఇయర్ వేడుకలు జరుపు కోవడమా? వద్దా అనేది అనవసరమైన చర్చే.. కానీ మనం చేసే ప్రతి పనిలో కొంత సామాజిక ప్రయోజం కూడా ఉండాలని నేను భావిస్తున్నాను..
కొత్త సంవత్సర వేడుకలకు ఖర్చు చేసిన సొమ్ములో కొంతైనా పేదలు, అనాధ పిల్లల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే కలిగే తృప్తి (లేదా పుణ్యం) ఎలా ఉంటుందో ఊహించుకోండి.. నా సలహా న్యూ ఇయర్ వేడుకల కోసమే కాదు.. మీ ఇంట్లో జన్మదిన, వివాహ వార్శికోత్సవాలు, ఇతర శుభ కార్యాలకు కూడా వర్తిస్తుంది.. మిగతా వివరాలకు నన్ను సంప్రదిస్తే అదెలాగో చెబుతాను..