Wednesday, January 2, 2019

ఇదేం సెక్కులరిజం?


నిజమైన భక్తులు ఎంతో నియమ నిష్టలతో ఆలయానికి వస్తారు.. కానీ దొంగలకు భయం, భక్తి ఉండవు.. అలాగే రాక్షసులు ధర్మాన్ని నాషనం చేసేందుకు ఎల్లవేళలా కాచుకొని ఉంటారు.. అన్య మతస్తులు విద్వేషంతో మన ధర్మంపై దాడికి వస్తారు?
మరి వీరెవరు?
పవిత్ర శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వారు వచ్చిన తీరు చూస్తే దొంగల్లాగే ఉన్నారు.. సాంప్రదాయాలకు ఉల్లంఘించిన తీరు చూస్తే రాక్షస సంతతే అనిపిస్తోంది. కనీసం కట్టూ బొట్టు లేని వీరు మన ధర్మీయులు మాత్రం కాదు.. సుప్రీం కోర్టు తీర్పు సాకుతో, లింగ సమానత్వం ముసుగులో, నకిలీ ఇరుముడులతో వచ్చిన వీరిని ఏమనాలి ఇంతకు?
కేరళ వామపక్షుల బరి తెగింపు ఇది.. తమ ప్రభుత్వం అండ చూసుకొని అయ్యప్ప ఆలయంలో ప్రవేశించిన ఆ పార్టీ కార్యకర్తలు మన ధర్మంపై దాడికి వచ్చారు.. ఇదే దుస్సాహసం అన్య మతస్తుల ప్రార్థనాలయాల విషయంలో చేయగలరా?.. సెక్యులరిజం ముసుగులో ఇలాంటి వెర్రి తలలను ఇంకా భరించాల్సిందేనా? ఈ దేశంలో మెజారిటీ ప్రజల సహనాన్ని అసమర్ధతగా భావిస్తున్న వీరికి కచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే..
ధర్మో రక్షతి రక్షిత: మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి.. అదే మనల్ని రక్షిస్తుంది.
.

1 comment:

  1. సార్!! చాలా కాలం తరువాత మళ్ళీ మీరు మీ బ్లాగువైపు చూసారు. ధన్యవాదములు సార్. మీ వ్యాసాలు చాలా బాగుంటాయండి.

    ReplyDelete