Friday, January 11, 2019

కుసంస్కారం

స్త్రీలను గౌరవించడం భారతీయ సంప్రదాయం.. అందుకే రాహుల్ గాంధీకి ఈ సంప్రదాయ విలువలు తెలియవేమో..
రఫేల్ ఒప్పందం గురుంచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆయన్ని ఉతికి ఆరేసింది.. రాహుల్ దీన్ని జీర్ణించుకోలేక నిర్మల సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీలను నోటికొచ్చినట్లు తూలనాడుతున్నారు. రక్షణ మంత్రిని అవమానించిన రాహుల్ సంజాయిషీ ఇచ్చుకోవలని జాతీయ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.. రాహుల్ అబద్ధాలను నిజాలుగా చూపే క్రమంలో వివేకాన్నే కాదు, సభ్యతా సంస్కారాలు కూడా కోల్పోతున్నారు..

1 comment: