Tuesday, May 30, 2017

గోహత్యా పాతకం ఊరికే పోతుందా?

మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి గోహత్యా పాతకం చుట్టుకుంది.. తామేమి చేస్తున్నామో ఆలోచించే సోయి కూడా లేకుండా పోయింది ఆ పార్టీ కేడర్ కు..  
యూత్ కాంగ్రెస్ జిందాబాద్.. హే మోదీ నరేంద్ర మోదీ అనే నినాదాలు చేస్తూ ఆవు దూడను కోసేశారు.. అనంతరం నిర్లజ్జగా కాంగ్రెస్ పతాకాల సాక్షిగా గోమాంసాన్ని పంచిపెట్టారు..
ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ దేశంలో మెజారిటీ ప్రజల మత విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ తన మూల సూత్రాలనే మరచి పోయింది.. గోహత్య నిషేధాన్ని కోరుకున్నారు మహాత్మా గాంధీ.. గాంధీ వారసులమని చెప్పుకునే వారు ఆయన అభిమతాన్ని బేఖాతరు చేశారు.. వారు చేయలేని పనిని మోదీ సర్కారు చేసేందుకు ప్రయత్నిస్తే నిర్లజ్జగా అడ్డుకుంటూ, నిరసన పేరిట ఆవు దూడనే బలి ఇచ్చారు..

కేరళ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పనిపై విమర్శలు రావడంతో ఖంగుతిన్న రాహుల్ గాంధీ ఈ ఘటనను ఖండించారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమిటి? గోహత్యా పాతకం ఊరికే పోతుందా?

No comments:

Post a Comment