Tuesday, May 2, 2017

పాకిస్తాన్ మళ్లీ కోలుకోలేని దెబ్బ తీయాలి..

సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం భారత భద్రతా ధళాలపై దాడి చేసింది.. ఇద్దరు జవాన్లను హతమార్చి అత్యంత దారుణం వారి శరీరాలను చిత్రం చేసింది.. భారత సైన్యం బదులు తీర్చుకుంది.. ఏడుగురు పాక్ జవాన్లను హతమార్చింది(?)..
తాజాగా జరిగిన పై ఘటన మీడియాకు సాధారణ వార్తగా మారిపోయింది.. ప్రజలు ‘ఓహో మళ్లీ పాకిస్తాన్ ఏదో చేసిందన్నమాట..’ అనుకొని నిట్టూర్చారు.. అంతగా మొద్దుబారిపోయాం మనం..
పాకిస్తాన్ పదే పదే మనల్ని ఎందుకు కవ్విస్తోంది?.. మన ప్రభుత్వం ఎందుకు ధీటుగా బుద్ది చెప్పలేకపోతోంది?.. ఇంకా ఎంత కాలం మనం ఆదే ఆగడాలను భరించాలి?.. ఎంత కాలం మనం ఇలా శాంతి,శాంతి అంటూ చేతులు ముడుచుకు కూర్చోవాలి?.. దేశం కోసం ఆలోచించే ప్రతి వ్యక్తిలోనూ రగిలే ప్రశ్నలు ఇవి..

ఇక మనం ఉపేక్షించి లాభం లేదు.. మన సహనాన్ని వారు చేతగాని తనంగా భావిస్తున్నారు.. మోదీజీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే.. పాకిస్తాన్ మళ్లీ కన్నెత్తి చూడకుండా కోలుకోని దెబ్బ తీయాల్సిందే.. జై హింద్

No comments:

Post a Comment