Saturday, May 9, 2015

భారత మిత్రుడు కామెరాన్

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ గతంలోకన్నా పూర్తి మెజారిటీ సాధించడం, డేవిడ్ కామెరాన్ తిరిగి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టడం భారత దేశానికి లాభదాయకం.. కామెరాన్ మొదటి నుండి మన దేశానికి మద్దతుదారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకుంటున్నారాయన. మన దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం చేసుకునేందకు కృషి చేస్తున్న కామెరాన్ ఐక్య రాజ్య సమితిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. స్వతహాగా లేబర్ పార్టీ భారత దేశానికి సన్నిహితమైనా, కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కామెరాన్ ఈ పరిస్థితిని మార్చేశారు. బ్రిటన్ లోని ప్రవాస భారతీయులు కూడా గతానికి భిన్నంగా కన్జర్వేటివ్లకు మద్దుతు ఇవ్వడానికి కామెరానే కారణం. ఈ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టడంలో భారతీయులు కూడా ప్రధాన పాత్ర పోషించారు.

డేవిడ్ కామెరాన్ స్వతహాగా ఆంగ్లికన్ క్రిస్టియన్ అయినా హిందూ మతం, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలంటే చాలా ఇష్టపడతారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు స్వామినారాయణ ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు కామెరూన్.. గతంలో కూడా ఆయన రెండు సార్లు ఆలయాన్ని సందర్శించి, దీపావళి పూజల్లో కూడా పాల్గొన్నారు. కామెరాన్ సతీమణి సమంత భారతీయ వస్త్ర ధారణతో రావడం గమనించాల్సిన విషయమే.. బ్రిటన్ హిందూయిజం నుండి స్పూర్తి పొందాలని, రామాయణం చదవండం ద్వారా తాను కుటుంబం, సమాజం, సేవ, విలువల గురుంచి తెలుసుకున్నానని కామెరాన్ ప్రకటించారు.. కామెరాన్ నాయత్వంలోని బ్రిటన్ తో సన్నిహిత సంబంధాలు విస్తరించడం ద్వారా భారత దేశానికి అన్ని రకాలుగా లాభ దాయకంగానే కనిపిస్తోంది.


No comments:

Post a Comment