Saturday, May 30, 2015

సోషల్ మీడియా సేవకు గుర్తింపు..

నారద జయంతి సందర్భంగా సమాచార భారతి సంస్థ విశిష్ట పాత్రికేయులకు పురస్కారాలు అందించింది.. నాతో పాటు వేదుల నరసింహం, వక్కలంక రమణ, మేడపాటి రామలక్ష్మి గార్లకు ఈ పురస్కారాలు అందజేశారు.. రెండున్నర దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో ఉన్న నేను సోషల్ మీడియా ద్వారా జాతీయ భావాలను ప్రచారం చేస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.. కార్యక్రమానికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 
ఈ పుస్కరానికి నన్ను ఎంపిక చేసి, బాధ్యతలను పెంచిన సమాచార భారతి అధ్యక్షులు హరిహర శర్మ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రావు, సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్ గార్లకు.. పురస్కారాన్ని నాకు అందజేసిన కిస్మత్ కుమార్ గారికి, కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్న మిత్రులు రామ్మోహన్, కృష్ణమూర్తి, నాగరాజారావు, నీలేష్, వీరప్ప, ప్రదీప్ నంబియార్, రాఘవేందర్ గార్లకు ధన్యవాదాలు.. 
ఈ పురస్కారంతో పాటు చెక్కు రూపంలో అందజేసిన నగదును నేను గ్రామ భారతి సంస్థకు అందజేయాలని నిర్ణయించుకున్నాను.. నాకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.. 

No comments:

Post a Comment