Tuesday, May 19, 2015

దేవుని సన్నిధిలో అబద్దాలు ఏల?

తిరుమలకు ఆంధ్ర, తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుండి ఎంతో మంది వీఐపీలు వస్తుంటారు.. వీరిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు ఉంటారు..
శ్రీవారిపై సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో వీరు వచ్చి దర్శించుకుంటారు..ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. అవి ఫలప్రదం కావలని మొక్కుకోవడానికి, తమ రంగాల్లో సాధించిన విజయం నేపథ్యంలో మొక్కు చెల్లించుకోవడానికి వేంకటేశ్వర స్వామి కొలువుకు రావడం ఆనవాయితీగా మారింది..
వీఐపీలు ఆలయం వెలుపలికి రాగానే మీడియా ప్రతినిధులు చుట్టుముడతారు.. ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే రాజకీయ నాయకులు దేవుని సన్నిధిలోనే అందమైన అబద్దాలు చెప్పడం మీరు ఎప్పుడైనా గమనించారా? దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరు అభివృద్ది చెందాలని స్వామివారిని కోరకున్నామని చెబుతారు జాతీయ స్థాయి నాయకులు.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం భగవంతున్ని మొక్కుకున్నామని బడాయిలు చెబుతారు మన ఏపీ, తెలంగాణ నాయకులు.. ఇతర ప్రముఖులు మాత్రం నిజాయితీగా మొక్కు చెల్లించుకోడానికి వచ్చినట్లు చెబుతారు.. 

ఇతరులతో పోలిస్తే రాజకీయ నాయకులు స్వామివారి ఆలయం వెలుపల ఎందకీ అందమైన అబద్దాలు చెబుతారు.. భగవంతుని సన్నిధిలో అబద్దాలు చెప్పేందుకు వారి అంతరాత్మ ఎలా అంగీకరిస్తోంది.. ప్రజలను నమ్మించడానికి భగవంతున్ని వాడుకోవడం ఎందుకుఆలోచించండి..

No comments:

Post a Comment