Wednesday, May 13, 2015

8 రోజుల సమ్మె తర్వాత హైడ్రామా..

ఈయన 43కు ఒప్పుకుంటే, పక్కాయన 44కు ఓకే చెప్పేసిండు.. ఏమిటీ హైడ్రామా?.. ఎనిమిది రోజుల సమ్మె తర్వాత ఇంత పెద్ద నాటకమా?.. ఒకరిని మించి ఒకరూ భలేగా నటించేశారు.. ఈ ఫిట్మెంట్ ఫిట్టింగేదో ముందే ప్రకటించి ఉంటే ఎనిమిది రోజుల పాటు ప్రజలకు నరకయాతన తప్పేది కదా? సమ్మె చేసిన కార్మికులకు జీతాలు పెరిగాయి.. హ్యాపీ.. సమ్మె కాలానికి కూడా జీతం కట్టి ఇస్తారు.. వెరీ హ్యాపీ.. కానీ వెర్రి వెంగప్ప ప్రయాణీకుడైపోయాడు.. మీ ఎరియర్లు మీకు వస్తాయి.. కానీ ఈ ఎనిమిది రోజులు ప్రయివేటు వాహనాల దోపిడీ తాలూకు నష్టాన్ని ఎవరు రీయంబర్స్ చేస్తాడు?.. మీరికి జీతాలు పెంచామనే సాకుతో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు ప్రయాణీకులపై వేసే వడ్డింపులు ఎవడు భరించాలి? చివరకు విరిగేది సామాన్యుడి నడ్డే కదా?

కోర్టు చీవాట్లేస్తే కానీ రెండు ప్రభుత్వాలు దిగిరావా?.. ఈ ఫిట్మెంట్ ఏదో అప్పుడే అంగీకరించి ఉంటే ఇంత నష్టం జరిగేదా? సమ్మె విరమించాలని కార్మిక సంఘాలను న్యాయ స్థానం హెచ్చరించాక వారికి వేరే మార్గం లేదు.. కానీ క్లైమాక్స్ చేరాక హీరోల్లా ఇద్దరు సీఎంలు రంగ ప్రవేశం చేయడంలోని ఆంతర్యం ఏమిటి? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ హైడ్రామా?

1 comment:

  1. వాస్తవం చెప్పారు. ఇప్పుడు ఇక మిగతా ఉద్యోగులూ మొదలెడుతారు - 50% జీతాల పెంపు కోసం.

    ReplyDelete