Sunday, September 18, 2016

పాకీలు మూల్యం చెల్లించుకోక తప్పదు..

యూరి సెక్టార్ పై ఉగ్రవాదుల దాడికి కారణమైన పాకిస్థాన్ కు గట్టి మన దేశం గట్టి బుద్ది చెప్పాల్సిందే..
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఈ సైనిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడి చాలా దారుణం.. ఈ ఘటనలో 17 మంది భారత జవానులు వీర మరణం పొందడం బాధాకరణం.. దాడి చేసిన నలుగురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టింది.. పాకిస్థాన్ సహాయ సహకారాలతో ఉగ్రవాద మూకలు తరచూ మన స్థావరాలపై దాడులు చేస్తూ, సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు..
ఇలాంటి దాడి ఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, తీవ్రంగా ఖండించడం షరా మామూలే.. కానీ పాకిస్థాన్ కు గట్టి జవాబు మాత్రం చెప్పలేకపోతున్నాం.. ఈ విషయంలో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోక తప్పదు..

కుక్కతోకలా పాకిస్థాన్ బుద్ది ఎప్పడూ వంకరే.. ఇటుకతో కొడితే మనం ఇటుకతో కొట్టే విధానం వద్దు.. వారు మళ్లీ కోలుకోని రీతిలో బదులు ఇవ్వాల్సిందే.. శాంతి, చర్చలు అంటూ మడిగట్టుకొని కూర్చుంటే వాళ్లు ఇంకా చెలరేగిపోతూనే ఉంటారు..  పాకిస్థాన్ మళ్లీ మన వంక చూసేందుకు సాహసించనంత గట్టిగా బుద్ది చెప్పాలి.. 

No comments:

Post a Comment