Wednesday, September 14, 2016

ఇనుమడించిన ఉత్సాహంతో..

14-09-1948.. హైదరాబాద్ సంస్థానంలో నిజాం సైన్యం నుండి మొదటి రోజు పెద్దగా ప్రతిఘటన లేకపోవడం భారత సైన్యానికి కాస్త ఆశ్చర్యాన్ని, కధనోత్సాహాన్ని కలిగించింది.. అనుమడించిన ఉత్సాహంతో సైన్యం రాజసూర్ పట్టణం వైపు బయలు దేరింది.. నిజాం సైన్యం చేతిలో ఉన్న కాలం చెల్లిన ఆయుధాలు, తుప్పు పట్టిన పరికరాలు భారత సైన్యాన్ని అడ్డుకోలేకపోయాయి.. మధ్యాహ్నంకల్లా రాజసూర్ పట్టణం స్వాధీనమైపోయింది..
ఉస్మానాబాద్ మాత్రం భారత సైన్యానికి, రజాకార్లకు కాస్త భారీ పోరాటమే జరిగింది.. వందలాది మంది రజాకార్లు మరణించారు.. మరోవైపు అసఫ్ జాహీ పాలకుల తొలి రాజధాని ఔరంగాబాద్ భారత సైన్యానికి చాలా తేలికగానే స్వాధీనమైపోయింది.. జాల్నా పట్టణం వద్ద భారత సైన్యాన్ని నిలువరించేందుకు నిజాం సైన్యం కాస్త గట్టిగానే ప్రతిఘటించింది.. వ్యూహాత్మంగా వ్యవహరించిన భారత సైన్యం జాల్నాను చివరకు స్వాధీనంలోకి తెచ్చుకోగలిగింది..

ఔరంగాబాద్ నగరాన్ని కోల్పోయిన వార్త తెలిసి హైదరాబాద్ లోని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కన్నీటిని ఆపుకోలేకపోయాడు.. ప్రధాని లాయక్ అలీతో సుధీర్ఘ మంతనాలు.. ఏం చేయాలో తోచని పరిస్థితి.. అన్ని వైపుల నుండి పరాజయ వార్తలే వస్తున్నా, దక్కన్ రేడియోలో మాత్రం నిజాం సైన్య పరాక్రమాలపై కాకిగోల ఆగలేదు.. (15 సెప్టెంబర్.. హైదరాబాద్ సమీపంలో భారత సైన్యం)

No comments:

Post a Comment