Thursday, September 29, 2016

పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం

కరిచింది పిచ్చికుక్కే కదా అని తేలికగా వదలొద్దు.. దుడ్డకర్ర తీసుకొని గట్టిగా ఒక్కటిచ్చుకోవాల్సిందే.. లేకుంటే మన సహనాన్ని పిరికితనంగా భావించే అవకాశం ఉంది..
ఉరీలో భారత సైనిక స్థావరంపై పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి తర్వాత దేశ ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.. పాకీలపై ప్రతికారం తీర్చుకోవాల్సిందే నినదించారు.. భారత సైన్యం అదను చూసి పాకిస్థాన్ కు గట్టి బుద్ధి చెప్పింది.. సర్జికల్ ఆపరేషన్ పేరుతో ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మెరుపు దాడి జరిపి 9 మంది పాకిస్థాన్ సైనికులను. 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది..

మంచితనం అన్ని వేళలా పనికి రాదు.. శత్రువు మంచి తనాన్ని కూడా బలహీనతగా భావిస్తాడు.. పదే పదే కవ్వించేవారికి గూబ పడిలేలా గట్టి జవాబు చెప్పాల్సందే.. ఇప్పుడు భారత సైన్యం చేసింది ఆ పనే..

1 comment:

  1. సహనానికీ హద్దుంటుంది, ఓర్పు జారితే జరిగేదే జరిగింది, దొంగకి కన్నంలో తేలు కుట్టినట్టయింది, పాక్ కి. జాగ్రత నేటి అవసరం, భారత సైన్యానికి జేజే లు

    ReplyDelete