Tuesday, September 20, 2016

దండం దశగుణం భవేత్..

పాకిస్థాన్ మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. మతం  ఆధారంగా భారత్ నుండి విడిపోయింది పాక్.. అంతటితో సరిపుచ్చుకోకుండా నిరంతరం మన దేశంలో అశాంతిని రగిలిస్తూ రాక్షసానందం పొందుతున్నారు అక్కడి పాలకులు..

భారత దేశంతో జరిగిన 1947, 1965, 1971, 1999 యుద్ధాల్లో ఘోర పరాజయం పొందింది వారికి బుద్ధి రాలేదు.. 1947లో కాశ్మీర్ లో చొరబడిన పాక్ మూకలను పూర్తిగా తరిమి కొట్టక ముందే ప్రధాని నెహ్రూ తొందరపాటుతో ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించారు.. అప్పటి నుండి సగం కాశ్మీర్ (పీవోకే) ఇంకా పాక్ కబ్జాలోనే ఉంది.. 1965లో భారత సైన్యం లాహోర్ దాకా చొచ్చుకుపోయి మన జాతీయ పతాకాలను సగర్వంగా ఎగురవేసింది.. కానీ మన ప్రభుత్వ ఆదేశాలతో తిరగి వచ్చేసింది.. 1971లో తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)ను కోల్పోయినా ఆ దేశానికి బుద్ది రాలేదు..  1999 కార్గిల్ యుద్దంలోనూ మనదే పై చేయి..
ప్రత్యక్ష పోరాటంలో గెలవలేక పరోక్షపద్దతిలో ఉగ్రవాదలను ప్రోత్సహిస్తోంది.. ముంబై మారణకాండ, పార్లమెంటుపై దాడి, సరిహద్దుల్లో చొరబాట్లు-కాల్పులు, ఆర్మీ క్యాంపులపై దాడుల వెనుక పాకిస్థాన్ ఉందని జగమెరిగిన సత్యమే అయినా తమకు సంబంధం లేదని బుకాయించడం వారికి అలవాటైపోయింది.. పాకిస్థాన్ తో శాంతి కోసం ఎన్ని చర్చలు జరిపినా బూడిదలో పోసిన పన్నీరే.. స్నేహ హస్తం అందించి వెన్నుపోటు పొడవడం ఆ దేశ పాలకులకు వెన్నతో పెట్టిన విద్య..

యూరిలో జరిగిన ఘటనపై దేశ ప్రజలంతా ఉడికిపోతున్నారు.. ఈ సమయం పాకిస్థాన్ తిరిగి కోలుకోలేని రీతిలో గుణపాఠం చెప్పడం తప్పని సరి.. ముందుగా మనం పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారీ దాడులు చేయాలి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలి.. దౌత్య మార్గంలో పాకిస్థాన్ కపట నీతిని ప్రపంచ దేశాలకు వివరించాలి.. అన్నింటికన్నా ముఖ్యం బలూచిస్థాన్ తిరుగుబాటుదారులకు నేరుగా సహకారం అందించాలి.. అప్పుడు పాకిస్థాన్ మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న వారి తొత్తులు కూడా దారికి వస్తారు..

No comments:

Post a Comment