Saturday, September 8, 2012

గోరక్షణ ఇలాగేనా?

ఇటీవల ఒకటి రెండు పత్రికల్లో, అందునా లోపలి పేజీలో వచ్చిన వార్త ఇది.. ఎవరినీ ఆకర్శించని వార్త అనుకుంటా.. అందుకే అంతగా పట్టించుకొనివుండరు.. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం-1977ను తీసుకొచ్చి మూడున్నర దశాబ్దాలు అయినా ఇంత వరకూ అమలు చేయకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది.. గో సంరక్షణ ఇలాగేనా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది.. నాలుగు నెలల్లో నిబంధనలు రూపొందించాలని న్యాయస్థానం ఆదేశించింది.. కొద్ది రోజుల క్రితం ఇదే మరో అంశంపై మరో వార్తను ఓ పత్రికలో చూశాను.. మెదక్ జిల్లాలో విచ్చల విడిగా పశువధ శాలలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు న్యాయమూర్తి తప్పు పట్టారు.. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద తగ్గి వ్యవసాయాభివృద్ధి తగ్గడాన్ని ప్రస్థావించారు..

హైదరాబాద్ నగరంలో, శివార్లలో రోడ్లపై విచ్చల విడిగా పిచ్చి కుక్కలు తిరుగుతూ, జనాలను కాటేస్తూ భయబ్రాంతులను చేస్తున్నాయి.. ఒక స్వచ్చంధ సంస్థ కుక్కలను చంపొద్దన్న సాకును చూపి ప్రభుత్వం పిచ్చి కుక్కల నిర్మూళనను గాలి కొదిలేసింది.. మన ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు పశు సంపదపై ఈ భూత దయ ఎందుకు లేదో అర్థం కావడంలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి పశు సంపద ఎంతో అవసరం. పాల ధరలు పేదలకు అందుబాటులో లేక వారి పిల్లలు తాగలేకపోతున్నారు.. మరి మనకు వీధి కుక్కలు ముఖ్యమా? పశు సంపద ముఖ్యమా?.. మత విశ్వాసాల విషయంలో చూసీ చూడనట్లు ఉండే మెజార్టీ వర్గ ప్రజలు ఆవును, పశు సంపదను పవిత్రంగా పూజిస్తారు.. ఈ అంశం మైనారిటీలకు సంబంధించినదో, రిజర్వేషన్ల అంశమో అయితే రాజకీయ నాయకులు పోటీ పడి ఉద్యమించేవారు.. కనీసం బీజేపీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం..

No comments:

Post a Comment