Friday, September 14, 2012

పేదల బాధలు పట్టని సర్కారు


బ్రిటిష్ వాడు మన దేశంలో టీ ప్రవేశ పెట్టే కొంత కాలం పాటు ఉచితంగా తాగించి అలవాటు చేశాడట.. మన స్వదేశీ ప్రభుత్వం కూడా వంట చెరుకు బదులు గ్యాస్ వాడకాన్ని సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించి, ఇప్పడు సబ్సిడీలు ఎత్తేస్తామంటోంది.. నిజానికి మన దేశంలో పెట్రోలు, డీజిల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు రాజకీయ నాయకులు, వారి బంధుమిత్రుల చేతిలోనే ఉన్నాయి.. ధరలు ఎంత పెరిగితే వారికి అంతగా లాభాలు వస్తాయి.. ప్రజల కష్టాలు పాలకులకు పట్టవు.. యూపీఏ పాలనలో మరీ ఘోరంగా పెట్రో బాధలు పెరిగిపోయాయి.. మళ్లీ అధికారంలోని వస్తామన్న ఆశలు లేని కాంగ్రెస్ పాలకులు అందిన కాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ధరలు ఎంత పెరిగినా ధనికులకు బాధ తెలియదు.. కానీ కష్టాలు అనుభవించేది పేదలు, మధ్య తరగతి ప్రజలే.. అసమర్థ పాలకులకు బుద్ది చెప్పేందుకు ఎన్నిక దాకా ఎదురు చూడాలా?.. కన బడిన చోటల్లా 'సత్కారం' చేద్దాం.. అప్పుడైనా బుద్ది వస్తుందోమో చూద్దాం..

No comments:

Post a Comment