Sunday, September 16, 2012

రెడ్డొచ్చె.. రెడ్డిబాయె..

కిరణ్ కుమార్ రెడ్డిని మార్చేసి జైపాల్ రెడ్డిని సీఎంను చేస్తారట.. మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవ రూపం దాలిస్తే మరణ శయ్యపై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా తన ఆక్సిజన్ తానే తొలగించుకున్నట్లే.. ముచ్చటగా నాలుగో కృష్ణుడు వచ్చినా నాటకాన్ని రక్తి కట్టించడం అసాధ్యమే.. కిరణ్ చేయలేని ఘన కార్యాలేవో జైపాల్ చేస్తాడని ఊహించడం అత్యాశే.. జైపాల్ రెడ్డిని తెరపైకి  తెలంగాణ వాదాన్ని అడ్డుకుందామని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తే అది అవివేకమే.. రాష్ట్రంలో పరిపాలన ఎప్పడో గాడి తప్పింది.. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న తరుణంలో ఎన్ని దిద్దుబాట్లు చేపట్టినా వృధా ప్రయాసే.. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం వరుప తప్పటడుగులు వేస్తోంది.. ఈ అడుగులన్నీ పతనం వైపే..

No comments:

Post a Comment