Monday, September 24, 2012

ఇంకా వీరిని నమ్మాలా?

ఎన్డీఏ అయినా, యూపీఏ అయినా నమ్మదగని వ్యక్తులు మన దేశంలో కొందరు ఉన్నారు.. వీరి వల్ల దేశానికి ఏమాత్రం ప్రయోజనం లేదు.. పైగా నమ్మిన పార్టీలకు నష్టమే అధికంగా ఉంటుంది.. గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన మమతా బెనర్జీ సిల్లీ కారణాలు చూపించి బయటకు వచ్చి క్రమంగా కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు.. ఇప్పడు మళ్లీ యూపీఏను వదిలించుకున్నారు.. తృతీయ ఫ్రంట్ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ములాయం సింగ్ యాదవ్ వారికి బురిడీ కొట్టి యూపీఏకు మద్దతు పలికారు.. ఇలాంటి అవకాశ వాదులను దేశ ప్రజుల నమ్మడం ఎంత వరకూ సమంజసం? ఫరూక్ అబ్దుల్లా, రాం విలాస్ పశ్వాన్, అజిత్ సింగ్ లాంటి నాయకులు కూడా ఇదే కోవకు చెందిన వారు.. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడకు చేరిపోయే ఇలాంటి వలస పక్షల వల్ల దేశానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ.. వీరి సెక్యులరిజం సొల్లు కబుర్లను నమ్మి మోసపోయేందుకు దేశ ప్రజలు ఏమాత్రం సిద్దంగా లేరు..
మన చంద్రబాబు సైతం ఇలాంటి అవకాశ వాద రాజకీయాల్లో దిట్ట.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా ప్రయోజనాలు పొందింది చంద్రబాబే.. బాబుకు బీజేపీ నేతలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో తమ పార్టీ ప్రయోజనాలను బలి పెట్టుకున్నారు.. కేవలం బీజేపీ కారణంగానే చంద్రబాబు రెండోసారి సీఎం కాగలిగారు.. టీడీపీ అధినేతకు ఇష్టం లేదనే సకారణం వల్లే తెలంగాణ వాదాన్ని బీజేపీ తాత్కాలికంగా పక్కన పెట్టింది.. తీరా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం కోల్పోగానే బాబు గారు బీజేపీకి రాంరాం చెప్పేసి సెక్యులరిజం పాచిపాట అందుకున్నారు.. ఏరు దాటగానే బోడి మల్లయ్య అనే నాయకుల పట్ల, రెండు కళ్ల సిద్దంతాలు వళ్లించే కపట నాటక సూత్రదారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మళ్లీ మోసపోవడం కాయం..


No comments:

Post a Comment