Thursday, September 6, 2012

ఫారిన్ బ్రాండ్ మహిమ

నిన్న' టైమ్' ఇవాళ 'వాఐింగ్టన్ పోస్టు' మన ప్రధాని అసమర్థ పనితీరును ఎండగట్టాయి.. మన్మోహన్ సింగ్ పరిపాలన గురుంచి ఈ పత్రికలు రాసిందాంట్లో కొత్తేమీ లేదు.. భారతీయ పత్రికలు తరచూ ఇలాంటి కథనాలు రాసినా ఫారిన్ సరకులాగా విదేశీ పత్రికలు రాస్తే మరింత విలువ ఉండటం సహజం.. అంతర్జాతీయ పత్రికలు మన దేశంపై ఏది రాసినా కొంత మేర సంచలనం సహజం.. భారత దేశంలో సింగ్ గారి ప్రతిష్టే ఇప్పటికే మసకబారింది.. ఇప్పడు ఈ పత్రికలు అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేశాయి.. దేశీయ పత్రికలు ఎంత రాసినా దున్నపోతుపై వాన పడ్డ చందాన పట్టించుకోని ప్రధాని కార్యాలయం, కాంగ్రెస్ అధిష్టానం వాషింగ్టన్ పోస్టు పత్రికపై తీవ్ర అగ్రహంతో రుసరుసలాడుతూ స్పందించాయి..

No comments:

Post a Comment