Monday, September 24, 2012

ఉల్టా చోర్..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచిన ప్రధాని మన్మోహన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, డబ్బులు చెట్లకు కాయవని దేశ ప్రజలతో నిష్టూరమాడారు.. నిజమే డబ్బు చెట్లకు కాస్తుందని ఎవరూ భావించడం లేదు.. అదే సమయంలో డబ్బు కోసం దేశానికి తాకట్టు పెట్టమని ఎవరూ చెప్పడం లేదు.. ప్రధాని వైఖరి చూస్తుంటే డబ్బు కోసం విలువలను సైతం దిగజార్చుకోవచ్చన్నట్లుగా ఉంది.. మన దేశానికి కొన్ని విలువలు ఉన్న విషయం మన్మోహన్ మరిచిపోయినట్లున్నారు.. మానాభిమానాలు అమ్ముకోవడానికి దేశ ప్రజలు సిద్దంగా లేరని ప్రధానమంత్రిగారు గుర్తుంచుకుంటే మంచిది..
ప్రజల సొమ్ము పందికొక్కుల్లా మేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మన్మోహన్ సింగ్ తో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు లేదు.. 2జీ స్కాం, కామన్ వెల్త్ క్రీడలు, కోల్ గేట్, ఆదర్శ్ కుంభకోణాల్లో వారు తిన్న సొమ్ము కక్కిస్తే, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పిస్తే దేశానికి ఈ దుస్థితి ఉండేదా? ప్రజలు పన్నుల ద్వానా మెక్కిన సొమ్మును కాజేసిన దొంగలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి, డబ్బు చెట్లకు కాయదని పరిహాసమాడటం సిగ్గు లేని తనమే.. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో మారా’ అంటే ఇదేనేమో?

No comments:

Post a Comment