Sunday, June 10, 2012

కార్టూన్లపై పగ..

ప్రజాస్వామ్యం దేశంలో ఉంటూ కార్టూన్లను చూసి సహించలేక పోతున్నారు మన నేతలు.. పత్రికా స్వేచ్ఛను గౌరవించలేకపోతున్నారు.. ఎన్నో ఏళ్ల క్రితం ప్రముఖ కార్టూనిస్టులు గీసిన చిత్రాలను పట్టుకొని రంద్రాన్వేషణ చేస్తున్నారు.. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించారంటూ కొందరు పార్లమెంట్ సభ్యులు చేసిన మతిలేని రాద్దాంతానికి యూపీఏ ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది.. పాఠ్య పుస్తకాల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.. స్వాతంత్ర్యం వచ్చిన తొలి ఏళ్లలో ప్రచురించిన ఈ కార్టూన్ పై అప్పట్లో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.. అంబేద్కర్ కుటుంబ సభ్యులకు కూడా ఈ కార్టూన్ విషయంలో అభ్యంతరాలు లేవు.. తాజాగా డీఎంకే అధినేత కరుణానిధి దశాబ్దాల నాటి ఓ కార్టూన్ను పట్టుకొని కొత్త రాద్దాంతానకి తెర తీశారు.. ఈ వృద్ధ నేతకు మరేపని లేనట్లుంది.. ఓ ప్రొఫెసర్ తనపై అభ్యంతరకర కార్టూన్ను ఎవరికో మెయిల్ చేశాడంటూ బెంగాళీ కంగాళీ మమత దీదీ ఆయన్ని ఏకంగా జైలుకు పంపింది.. జవహర్లాల్ నెహ్రూ, ఎన్టీ రామారావు లాంటి నేతలు తమపై వచ్చిన కార్టూన్లపై ఏనాడూ నొచ్చుకోలేదు, అభ్యంతర పెట్టలేదు.. పైగా ఎంతో ఎంజాయ్ చేస్తూ కార్టూనిస్టులను ప్రోత్సహించారు.. ఈ నేతలు కార్టూనిస్టుల పాలిట ప్యారడైజ్లు.. అలాంటి స్పూర్తి ఇప్పుడు ఏమైపోయిందో?.. ఇప్పటి నేతలు కార్టూన్లపై ఎందుకు పగబట్టినట్లో..

No comments:

Post a Comment