Tuesday, June 12, 2012

యే దోసితీ..

నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నరాందేవ్ బాబాకు యావదాంధ్రలో ఏకైక నిజాయితీ పరుడు, మచ్చలేని పోరాట యోధుడు దొరికాడు.. తన దేశ యాత్రలో భాగంగా భాగ్యనగరం వచ్చిన బాబా, ఆయన్ని మాత్రమే కలిసి అర్జంటుగా తిరిగి వెళ్లిపోయారు.. గతంలో కూడా బాబా ఇలాగా బిజీ షెడ్యూల్డ్ కారణంగా మరెవరినీ కలవకుండా బాబును మాత్రమే కలుసుకున్నారు.. పాపం బాబా రాందేవ్ కళ్లకు తెలుగునాట ఇంతకన్నా మంచి స్వాతిముత్యాలు దొరలేదు మరి.. ‘యే దోసితీ.. న కభీ చోడింగే..(షోలే)’ అంటూ స్నేహ గీతాలు పాడుకుంటూ కౌగిలింతలతో పరవశించి పోయారిద్దరూ.. మెరిసే దంతా బంగారం కాదని బాబాకు తెలియదా?.. లేక ఏపీలోని రాందేవ్ శిష్యలు ఇక్కడి పరిస్థితులను బాబాకు చెప్పలేదా?.. లేక అన్నీ తెలిసే బాబా దోస్తీ కలుపుకున్నారా?.. నాకు పచ్చకామెర్లు సోకాయేమో తెలియదు కానీ బాబా వేసుకున్న దుస్తుల్లో కాస్త పసుపుదనం కనిపించింది.. జూబ్లీహిల్స్ నేస్తాన్ని చూడటానికి వచ్చిన బాబా, చంచల్ గూడా దోస్తును కలవకుండానే పోయారెందుకో?..

No comments:

Post a Comment