Wednesday, June 6, 2012

జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే..

కాలాన్ని వెనక్కి తిప్పలేం.. జరిగి పోయిన సంఘటనల ప్రతిఫలాన్ని మాత్రమే చూడగలం.. ఇలా జరిగి ఉంటే ఎలా ఉండేది అనే ఆలోచనలు చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నం మాత్రమే..

జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఏమి జరిగేది? వైఎస్ తనయుడిగా ఆయనకు కచ్ఛితంగా కేంద్ర మంత్రి పదవి దక్కేది.. తనకున్న ఎమ్మెల్యేల మద్దతుతో కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థ పాలన కారణంగా ముఖ్యమంత్రి పదవిని కూడా పొంది ఉండే వారేమో? అన్నింటికన్నా ముఖ్యం అసలు సీబీఐ కేసు కూడా తెర మీదకు వచ్చేది కాదు.. ఈ విషయం చెప్పడానకి రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు.. బుర్రున్న కుర్రాడెవరైనా చెప్పగలడు..

కానీ గులాం నబీ ఆజాద్ నోరు విప్పడం వల్ల కందిరీగ తుట్టె కదిపినట్లైంది.. అసలు విషయం చెప్పేసి నాలిక కరచుకొని తన ఉద్దేశ్యం అది కాదని బుకాయించినా, ముసుగును తొలగించేశారు..

నిజమే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడకుంటే సీబీఐ కేసు ఉండేదే కాదేమో?.. పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన వెంటే ఉండే వారేమో? అధిష్టానానికి ఇష్టంలేకున్నా సంఖ్యా బలంతో తనకు ఇష్టమైన ముఖ్యమంత్రి పదవిని దర్జాగా పొందేవారేమో?.. యూపీఏ ప్రభుత్వాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకునే వారేమో?.. అన్నింటికన్నా ముఖ్యంగా అవినీతి సామ్రాజ్యానికి చట్ట బద్దత వచ్చి దర్జాగా ఉండే వారేమో?.. పులివెందుల బిడ్డ తిరగబడుడే పాపమైపోయింది..

No comments:

Post a Comment